1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 మే 2022 (22:16 IST)

హీరో మహేష్ బాబు నోట సీఎం జగన్ డైలాగ్ - సోషల్ మీడియాలో వైరల్ (Video)

mahesh - keerthy
హీరో మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సర్కారువారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్. పరశురాం దర్శకుడు. ఈ చిత్రం ట్రైలర్‌ను మే డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ నెల 12వ తేదీన చిత్రం విడుదలకానుంది. అయితే, ఇందులో గత 2019 ఎన్నికల ప్రచారంలో వైకాపా అధ్యక్షుడుగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి చెప్పిన 'నేను విన్నాను... నేను ఉన్నాను' డైలాగ్‌ ఉంది.  ఈ డైలాగ్‌ను మహేష్ బాబు తన చిత్రంలో ఉటంకించడంతో మరోసారి వైరల్ అయింది. 
 
మహేష్ బాబు నుండి వైఎస్ జగన్ డైలాగ్‌కు అభిమానుల నుండి విపరీతమైన స్పందన వస్తోంది. ప్రధాన నటి కీర్తి సురేష్ తన విద్యను కొనసాగించడానికి 10,000 డాలర్లు అప్పుగా ఇవ్వమని అడిగిన తర్వాత మహేష్ అదే డైలాగ్ చెప్పాడు.
 
ఆమె అభ్యర్థనపై స్పందిస్తూ, అతను ఆమె చేతులు పట్టుకుని, నేను 'విన్నాను... నేను ఉన్నాను' అని డైలాగ్ చెబుతాడు. ఇపుడు ఈ డైలాగ్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చారు.