గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2017 (11:34 IST)

నేహా ధూపియాకు యాక్సిడెంట్... కాపాడటం మానేసి, సెల్ఫీలకు ఎగబడిన జనం!

టాలీవుడ్ హీరో బాలకృష్ణ నటించిన "పరమవీరచక్ర" చిత్రంలో హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ నటి నేహా ధూపియా ఒకరు. ఈమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ విషయం ఆ ప్రాంత వాసులకు తెలియడంతో ఒక్కసారిగా జనం భ

టాలీవుడ్ హీరో బాలకృష్ణ నటించిన "పరమవీరచక్ర" చిత్రంలో హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ నటి నేహా ధూపియా ఒకరు. ఈమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ విషయం ఆ ప్రాంత వాసులకు తెలియడంతో ఒక్కసారిగా జనం భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. వీరంతా ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించకుండా నటి నేహాతో సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చండీగఢ్‌లో ఓ ఆడియో ఫంక్షన్‌కు వెళ్లి, తిరిగి వస్తున్న సమయంలో నేహా ధూపియా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. బ్రేకులు పని చేయకపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించిందింది. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలు కాకపోయినా, ఆమె కళ్లద్దాలు పగిలిపోయాయి. రోడ్డు మధ్యన ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో, రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. 
 
కారులో ఉన్నవారికి సాయం చేయడానికి వెళ్లినవారు... అందులో ఉన్న నేహా ధూపియాను గుర్తు పట్టారు. అంతే... అక్కడున్న జనాలంతా ఆమె పరిస్థితిని పట్టించుకోకుండా, ఆమెతో సెల్ఫీలకు ఎగబడ్డారు. దీంతో ఆమె చాలా ఇబ్బందికి గురయింది. ఓ అర్థగంట సేపు వారికి సెల్పీలతో పాటు, ఆటోగ్రాఫ్‌లు ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత వేరే కారు రావడంతో... బతుకుజీవుడా అంటూ ఆమె ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయింది.