1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 29 జులై 2016 (13:15 IST)

పవన్ కల్యాణ్ బెంజ్ కారు అమ్మేశారు.. ఫస్ట్ టైమ్ అవార్డ్ ఫంక్షన్‌కు వచ్చారు.. కారణం అదేనా?!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ఫంక్షన్‌లకు ఎప్పుడూ దూరంగా ఉంటారన్నది అందరికీ తెలుసు. అయితే హైదరాబాదులో జరిగిన రేడియో మిర్చి అవార్డ్స్ ఫంక్షన్‌కు హాజరైన పవన్ కల్యాణ్ అందరికీ షాకిచ్చారు. ఈ ఫంక్షన్‌కు ప

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ఫంక్షన్‌లకు ఎప్పుడూ దూరంగా ఉంటారన్నది అందరికీ తెలుసు. అయితే హైదరాబాదులో జరిగిన రేడియో మిర్చి అవార్డ్స్ ఫంక్షన్‌కు హాజరైన పవన్ కల్యాణ్ అందరికీ షాకిచ్చారు. ఈ ఫంక్షన్‌కు పవన్ కల్యాణ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక ఆయన ఫ్యాన్స్‌కు పండగే పండగ. పలు విభాగాలలో సత్తా చాటిన వారికి ఈ మిర్చి మ్యూజిక్ అవార్డ్‌ని అందించి పవన్ సత్కరించారు. పవన్ కళ్యాణ్, వెంకటేష్, కమల్ హాసన్, విక్రమ్, నాని, మంచు లక్ష్మి , దేవిశ్రీ ప్రసాద్ వంటి అగ్రతారలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చేతులపై దేవి శ్రీ ప్రసాద్‌ బెస్ట్ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తొలిసారిగా సినిమా అవార్డుల ఫంక్షన్లకు హాజరు కావడం కొత్త అనుభూతినిచ్చిందన్నారు. అంతేగాకుండా సినీ రంగంలో రాణిస్తున్న తారలకు అవార్డులను అందజేస్తున్న మిర్చికి పవన్ థ్యాంక్స్ చెప్పారు. 
 
అయితే ఈ ఫంక్షన్‌కు పవన్ కల్యాణ్ హాజరు కావడం వెనక ఆర్థిక ఇబ్బందులే కారణమంటున్నారు.. సినీ విశ్లేషకులు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇప్పటికే తన బెంజ్ కారును పవన్ కల్యాణ్ అమ్మేశారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో అవార్డ్ ఫంక్షన్‌కు తొలిసారి హాజరు కావడానికి కూడా అదే కారణమని టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది.