రకుల్ ప్రీత్ సింగ్ ఖాతాను ఓపెన్ చేసిన రానా - అఖిల్... విశాఖలో సందడి...
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఖాతాను యువ హీరో అఖిల్ అక్కినేని ఓపెన్ చేశాడు. పైగా, సముద్రతీరం విశాఖలో సందడి చేశారు. ఇంతకీ రకుల్ ప్రీత్ సింగ్ ఖాతాను అఖిల్ ఎలా ఓపెన్ చేశాడన్నదానిపై ప్రశ్నిస్తే...
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఖాతాను యువ హీరో అఖిల్ అక్కినేని ఓపెన్ చేశాడు. పైగా, సముద్రతీరం విశాఖలో సందడి చేశారు. ఇంతకీ రకుల్ ప్రీత్ సింగ్ ఖాతాను అఖిల్ ఎలా ఓపెన్ చేశాడన్నదానిపై ప్రశ్నిస్తే...
విశాఖపట్టణం నగరంలో దసపల్లా హిల్స్లో 'ఎఫ్ 45' పేరుతో జిమ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హీరోలు రానా, అఖిల్ హాజరయ్యారు. జిమ్లోని సామగ్రిని రానా, అఖిల్, రకుల్ పరిశీలించి కసరత్తులు చేశారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. రోజుకు 45 నిమిషాలు జిమ్కి కేటాయిస్తే మంచి ఫిట్నెస్ వస్తుందన్నారు.
హీరో అఖిల్ మాట్లాడుతూ జిమ్కు మంచి పేరు రావాలని ఆకాంక్షించారు. రకుల్ మాట్లాడుతూ సినిమా షూటింగ్ నిమిత్తం విశాఖలో వచ్చినప్పుడు ఇక్కడ జిమ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చిందన్నారు. 'టీమ్ ట్రైనింగ్... లైఫ్ ఛేజింగ్' నినాదంతో ప్రారంభమైన తమ జిమ్లో ఆస్ట్రేలియా కోచ్ శిక్షణ ఇస్తారన్నారు.