గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (17:38 IST)

మ‌రోసారి ప‌వ‌న్‌తో స‌మంత‌!

Samantha
స‌మంత అక్కినేని చేసే సినిమాలు భిన్న‌మైన‌విగా ఎంచుకుంటోంది. రొటీన్ త‌ర‌హా పాత్ర‌లు చాలా చేసేశాను అంటూ ఏదైనా ఇంట్రెస్ట్ క‌లిగే క‌థ, పాత్ర వుంటే చాలు చేసేస్తానంటూ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది. ది ఫ్యామిలీ మేన్‌2లో ఆమె చేసిన రాజీ పాత్ర గురించి తెలిసిందే. `ఓబేబీ` సినిమా త‌ర్వాత అలాంటి భిన్న‌మైన పాత్ర‌ను చేయ‌డంలో స్పీడ్ పెంచింది. తాజాగా గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌లం` సినిమా చేస్తోంది. అది పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే యాభైశాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది.
 
రామ్‌చ‌ర‌ణ్‌తో `రంగ‌స్థ‌లం` చేసిన ఆమె తాజా స‌మాచారం ప్ర‌కారం ప‌వ‌న్‌క‌ళ్యాన్‌కు జోడిగా మ‌రో సినిమా చేయ‌నున్న‌ద‌ట‌. పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా సమంతను తీసుకోవాలనే ఉద్దేశంతో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నార‌ని తెలుస్తోంది. వీరి కాంబినేష‌న్‌లో ‘అత్తారింటికి దారేది’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్ర‌క‌ట‌న రానుంది.