చిరు ఫ్యామిలీ ఆశీస్సుల కోసమేనా...?! సయేషా వీణ డ్యాన్స్
మెగా ఫ్యామిలీ ఆశీస్సుల కోసం చాలామంది నటీమణులు తాపత్రయపడుతుంటారు. ఇటీవలే నటి సయేషా.. చిరంజీవి చేసిన వీణ డాన్స్ను సైమా అవార్డుల్లో చేసింది. అక్కడ వున్న అల్లు అర్జున్ అండ్ టీమ్ తెగ ఎంజాయ్ చేశారు. అఖిల్.. సినిమాలో అఖిల్ సరసన నటించిన దిలీప్ కుమార్
మెగా ఫ్యామిలీ ఆశీస్సుల కోసం చాలామంది నటీమణులు తాపత్రయపడుతుంటారు. ఇటీవలే నటి సయేషా.. చిరంజీవి చేసిన వీణ డాన్స్ను సైమా అవార్డుల్లో చేసింది. అక్కడ వున్న అల్లు అర్జున్ అండ్ టీమ్ తెగ ఎంజాయ్ చేశారు. అఖిల్.. సినిమాలో అఖిల్ సరసన నటించిన దిలీప్ కుమార్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని సయేషా తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం ఇద్దరికీ డిజాస్టరే.
ఆ తర్వాత హిందీలో 'శివాయ్' అనే సినిమా చేయడానికి సిద్ధమైంది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఆ సినిమా తర్వాత సైమా అవార్డుల్లో ఆమెకు అవకాశం వచ్చింది. ఇప్పుడు తెలుగులో చేయడానికి ప్రయత్నాలు చేస్తుందని తెలిసింది. డాన్స్ బాగా వచ్చు కనుక నటన ఈజీగా చేసేయవచ్చని ఆశిస్తోంది. ఇప్పటికే పలువురు దర్శకుల్ని కలిసినట్లు తెలుస్తోంది. ఎప్పుడో షడెన్గా.. మెగా కాంపౌండ్ హీరోలతో తెలుగులో మరలా ప్రత్యక్షమవుతుందేమో చూడాలి. అల్లు శిరీష్ పక్కన నటించే ఛాన్స్ లేకపోలేదని.. సినీవర్గాలు తెలియజేస్తున్నాయి.