శనివారం, 15 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2016 (11:40 IST)

ఒకే కారులో ఒకే సీటులో పక్కపక్కనే జాన్వి కపూర్.. శిఖర్‌ జోడీ.. శ్రీదేవి ఒప్పేసుకున్నారా?

వెండితెర అతిలోక సుందరి శ్రీదేవి. ఈమె బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ను పెళ్ళి చేసుకుంది. వీరికి జాన్వి కపూర్‌, ఖుషీ కపూర్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడిప్పుడు యుక్తవయస్సుకు వస్తున్

వెండితెర అతిలోక సుందరి శ్రీదేవి. ఈమె బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ను పెళ్ళి చేసుకుంది. వీరికి జాన్వి కపూర్‌, ఖుషీ కపూర్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడిప్పుడు యుక్తవయస్సుకు వస్తున్న ఈ ఇద్దరు అమ్మాయిలు సోషల్‌ మీడియాలో తమ పోస్టుల ద్వారా హాట్‌టాపిక్‌గా మారుతున్నారు. 
 
ముఖ్యంగా.. శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. జాన్వి తన బాయ్‌ఫ్రెండ్‌ శిఖర్‌ పహరియాను ముద్దుపెట్టుకోవడం, వీరిద్దరు లిప్‌ టు లిప్‌ కిస్‌ చేసుకున్న ఫొటోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్‌‌గా వ్యాపించాయి కూడా. ఈ శిఖర్ ఎవరో కాదు... కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే మనువడు. 
 
శిఖర్‌తో తన కూతురు డేటింగ్‌ చేయడం శ్రీదేవికి ఏమాత్రం నచ్చడం లేదని కథనాలు కూడా వచ్చాయి. తాజాగా షారుఖ్ ఖాన్, అలియా భట్‌లు నటించిన 'డియర్ జిందగీ' స్క్రీనింగ్‌కు శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులతో పాటు జాన్వి, శిఖర్‌‌లు కలిసి ఒకే కారులో వెళ్లడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో శ్రీదేవి, బోనీ కపూర్లు జాన్వి, శిఖర్‌ల రిలేషన్ షిప్‌ను అంగీకరించారనే వార్తలు గుప్పుమంటున్నాయి.