శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 సెప్టెంబరు 2020 (09:41 IST)

ఛిద్రమైన నా జీవితంలో వెలుగులు నింపిన ఆత్మబంధువు : గాయని సునీత

గాన గంధర్వుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం శాశ్వతనిద్రలోకి జారుకున్నారు. కరోనా వైరస్‌ను జయించినప్పటికీ.. అనారోగ్యం ఆయన్ను దెబ్బతీసింది. ఫలితంగా శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటల సమయంలో ఈ లోకాన్ని విడిచి దివికేగారు. ఆయన మృతిపై భారతీ సంగీత ప్రపంచం శోకసముద్రంలో మునిగిపోయింది. ముఖ్యంగా, సంగీత కళాకారులు, గాయనీగాయకులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. అలాంటి వారిలో తెలుగు గాయని సునీత ఒకరు. ఈమెకు ఎస్పీకి ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. 
 
ఎస్పీబీ మృతిపై సునీత స్పందిస్తూ, 'పాడుతా తీయగా' కార్యక్రమం ద్వారా ఎందరో గాయకులను బాలు తయారు చేశారని చెప్పారు. ఛిద్రమైన తన జీవితంలో వెలుగు నింపిన వ్యక్తి బాలు అని తెలిపారు. పాట మీద ప్రేమ కల్పించారని, పాడాలనే తపనను పెంచారని చెప్పారు. జీవితం మీద మమకారాన్ని పెంచిన ఆత్మబంధువు అని తెలిపారు. తన మామయ్య భౌతికంగా మాత్రమే లేరని.. గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని తెలిపారు.