గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 30 మే 2017 (19:33 IST)

దర్శకరత్న దాసరి నారాయణ రావు ఇకలేరు...

దర్శకరత్న దాసరి నారాయణ రావు కొద్దిసేపటి క్రితం కిమ్స్ ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసారు. ఆయన వయసు 75 ఏళ్లు. ఈ నెల 18వ తేదీన అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుప‌త్రిలో చేరిన ఆయన అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, మ

దర్శకరత్న దాసరి నారాయణ రావు కొద్దిసేపటి క్రితం కిమ్స్ ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసారు. ఆయన వయసు 75 ఏళ్లు. ఈ నెల 18వ తేదీన అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుప‌త్రిలో చేరిన ఆయన అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, మంగళవారం దాసరి ఆరోగ్యం హఠాత్తుగా బాగా క్షీణించింది. గ‌డిచిన ఐదు నెల‌ల్లో దాస‌రి నారాయ‌ణ రావు 2, 3 సార్లు ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవ‌ల ఆయన త‌న పుట్టిన‌రోజు వేడుక‌ల స‌మ‌యంలో కూడా ఉత్సాహంగానే క‌నిపించారు.
 
కాగా దాసరి స్వర్గం-నరకం చిత్రానికి స్వర్ణ నందిని అందుకున్నారు. కేంద్ర బొగ్గు-గనుల శాఖామంత్రిగా కూడా పనిచేశారు. 1942 మే నెల 4వ తేదీన తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన దాసరి నారాయణ రావు తొలి సినిమా తాతా మనవడు. మేఘసందేశం చిత్రానికి ఆయన ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. ఎన్టీఆర్‌తో బొబ్బిలి పులి, ఎఎన్నార్ తో ప్రేమాభిషేకం వంటి హిట్ చిత్రాలు ఆయన దర్శకత్వంలోనే వచ్చాయి.