1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Karnataka Elections 2018: Karnataka floor test

కర్ణాటకలో 4 గంటలకు షో... అసెంబ్లీలో యడ్యూరప్ప బలపరీక్ష

కన్నడ రాజకీయం పతాక స్థాయికి చేరింది. శనివారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి యడ్యూరప్ప బలపరీక్ష జరుగనుంది. వాస్తవానికి బల పరీక్షకు గవర్నర్ వజూభాయ్ పటేల్ 15 రోజులు గడువిచ్చినా, సుప్రీంకోర్టు దాన్ని తోసిప

Karnataka Elections 2018
కన్నడ రాజకీయం పతాక స్థాయికి చేరింది. శనివారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి యడ్యూరప్ప బలపరీక్ష జరుగనుంది. వాస్తవానికి బల పరీక్షకు గవర్నర్ వజూభాయ్ పటేల్ 15 రోజులు గడువిచ్చినా, సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చుతూ శనివారం 4 గంటలకు బలపరీక్ష నిర్వహించాల్సిందిగా ఆదేశించింది. దీంతో సాయంత్రం 4గంటలకు బలపరీక్ష జరుగనుంది.
 
ఇందుకోసం అసెంబ్లీ ఉదయం 11 గంటలకు ప్రారంభంకానుంది. ప్రొటెం స్పీకర్ కేజీ బోపయ్య ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత సాయంత్రం బలపరీక్ష ఉంటుంది. సీఎం యడ్యూరప్ప విశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు. రహస్య ఓటింగ్‌కు సుప్రీంకోర్టు అనుమతించక పోవడంతో… హెడ్ కౌంట్ నిర్వహించాల్సి ఉంటుంది. 
 
మరోవైపు బలపరీక్షలో నెగ్గుతామని ముఖ్యమంత్రి యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం ఆదేశాలను శిరసావహిస్తామన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు కొందరు తమకు ఓటేస్తారని ఆయన పరోక్షంగా వెల్లడించారు. 
 
మరోవైపు, బీజేపీ నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్‌లు శుక్రవారం  హైదరాబాద్‌లో క్యాంప్ పెట్టాయి. సిద్ధరామయ్య, కుమారస్వామి కూడా  హైదరాబాద్ వచ్చారు. పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత శుక్రవారం (మే-18) అర్థరాత్రి ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్‌ నుంచి ఎమ్మెల్యేల బృందం బయలుదేరింది. మొత్తం ఐదు బస్సులో ఎమ్మెల్యేలను తరలించారు. 
 
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలకు భారీ భద్రతను కల్పించారు. కాంగ్రెస్‌- జేడీఎస్‌ ఎమ్మెల్యేలతోపాటు తెలంగాణ చెందిన నేతలూ వెళ్లారు. ప్రస్తుతం కర్ణాటక పోలీసుల భద్రతలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేల వాహనాలకు ముందు వెనుకా కాంగ్రెస్‌ శ్రేణుల వావానాలు ఉన్నాయి. రోడ్డు మార్గంలో బస్సుల్లో బయలుదేరిన నేతలంతా సేఫ్‌గా శనివారం ఉదయం బెంగళూరుకు చేరుకున్నారు. 
About Writer
pnr
తర్వాతి కథనం
టెక్సాస్‌లో దారుణం.. పాఠశాల్లో కాల్పులు.. పేలుడు పదార్థాలు స్వాధీనం