1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2020 (10:22 IST)

ఫోర్బ్స్ జాబితాలో విత్తమంత్రి నిర్మలా సీతారామన్!!!

భారత విత్తమంత్రిగా నిర్మలా సీతారామన్ ఉన్నారు. ఈమెకు ఫోర్బ్స్ జాబితాలో చోటుదక్కింది. ప్రపంచపు అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారమన్‌తో పాటు పలువురు భారతీయ మహిళలకు చోటుదక్కింది. 
 
ఈ మ్యాగజైన తాజాగా మొత్తం 100 మంది పేర్లతో ఓ జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో మొదటి స్థానంలో జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌కు నిలిచారు. ఆపై రెండో స్థానంలో యూరప్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ క్రిస్టిన్ లగార్డే నిలిచారు. ఈ జాబితాలో అమెరికాకు కాబోయే వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ కూ స్థానం దక్కింది.
 
ఇక మన దేశానికి వస్తే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా, టెక్ దిగ్గజం హెచ్సీఎల్ సీఈఓ రోష్నీ నాడార్ తదితరులకు స్థానం లభించింది. 
 
అలాగే, 10 దేశాలకు చెందిన ఉన్నత పదవుల్లో ఉన్నవారు, 38 కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు, ఎంటర్ టెయిన్ మెంట్ విభాగంలో ఉన్న ఐదుగురు మహిళలను ఫోర్స్బ్ తన జాబితాలో శక్తిమంతులుగా పేర్కొంది.