శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 డిశెంబరు 2020 (21:38 IST)

ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోంది : సురేష్ ప్రభు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితిపై కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి, బీజేపీ భ్యుడు సురేష్ ప్రభు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేస్తోందని వ్యాఖ్యానించారు. పైగా, ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, చేయిదాటక ముందే చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ఈ మేరకు విత్తమంత్రి నిర్మలా సీతారమన్‌కు ఆయన ఓ లేఖ రాశారు. 
 
ఈ లేఖలో.. దేశంలోని పలు రాష్ట్రాలు అప్పులు చేయడం కోసం కార్పొరేషన్లను ఏర్పాటు చేసుకుంటున్నాయన్నారు. ఏపీలో ప్రభుత్వం చేస్తున్న అప్పులు పరిధిని దాటి పోయాయని చెప్పారు. ఈ అప్పులను సంక్షేమ పథకాలకు తరలిస్తున్నారని తెలిపారు. 
 
అభివృద్ధి పథకాలకు వాడాల్సిన నిధులను సంక్షేమ పథకాలకు తరలిస్తే... అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి చేయిదాటి దిగజారక ముందే చర్యలు తీసుకోవాలని కోరారు. సురేశ్ ప్రభు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెల్సిందే.