ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..
టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరో ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించిన చిత్రం 'స్పిరిట్'. ఎప్పటి నుంచో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ప్రాజెక్టు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఆదివారం మొదలైంది. ప్రారంభోత్సవానికి ప్రముఖ నటుడు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సినిమాని ఎప్పుడో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సెట్స్పైకి వెళ్లడం ఆలస్యమవుతూ వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని భారతీయ భాషలతోపాటు జపనీస్, కొరియన్, మాండరిన్లో విడుదల చేయనున్నారు. విజువల్స్ లేకుండా కేవలం ఆడియోతో క్రియేట్ చేసిన 'స్పిరిట్' టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. టి- సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లలో ప్రణయ్రెడ్డి వంగా, భూషణ్కుమార్, క్రిషన్కుమార్ నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకుడు.