జామపండు పేస్టుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే..

బాగా పండిన జామ పండులోని గింజలను తొలగించి.. గుజ్జును మాత్రం ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. జామపండు గుజ్జును బౌల్‌లోకి తీసుకుని అందులో రెండు స్పూన్ల పాలు వేసి మిక్స్ చేసుకోవాలి

Written By Selvi
Updated: మంగళవారం, 4 జులై 2017 (13:22 IST)
బాగా పండిన జామ పండులోని గింజలను తొలగించి.. గుజ్జును మాత్రం ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. జామపండు గుజ్జును బౌల్‌లోకి తీసుకుని అందులో రెండు స్పూన్ల పాలు వేసి మిక్స్ చేసుకోవాలి. జిడ్డు చర్మం వాళ్ళు అర స్పూను ఉప్పును వేసుకోవాలి. ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకుని పంచదార నీటితో ముఖాన్ని స్క్రబ్ చేయాలి. 
 
ఆపై కడిగేసి.. ఐదు నిమిషాల తర్వాత జామపండు, పాల గుజ్జును ముఖానికి పట్టించి.. పేస్ట్‌ను ముఖంపై వలయాకారంలో రబ్ చేయాలి. పదినిమిషాలపాటు మసాజ్ చేసి తడి కాటన్‌బాల్స్‌తో ముఖాన్ని క్లీన్ చేయాలి. ఫేషియల్ ప్యాక్‌ను తీసుకుని ముఖానికి పొరలు పొరలుగా అప్లై చేసుకుని పావుగంట తర్వాత నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ను వారానికోసారి చేస్తే చర్మం మెరిసిపోతుంది. 
 
ఇంకా రాత్రి పడుకోబోయే ముందు టీ స్పూన్ పుదీనా రసాన్ని ముఖానికి పట్టించి తెల్లవారి కడిగేస్తే మొటిమలు తగ్గుముఖం పడతాయి. ఒక టొమాటోని తీసుకుని గుండ్రగా కట్ చేసుకోవాలి. ముఖాన్ని శుభ్రం చేసుకుని తరిగిన టొమాటో ముక్కలతో ముఖాన్నంతా వలయాకారంలో సుతిమెత్తగా ఐదు నిమిషాల పాటు మర్దన చేస్తే ముఖం కాంతులీనుతుంది.

అన్నీ చూడండి

ఆస్ట్రేలియా బాండీ బీచ్‌ కాల్పుల ఘటన హీరోకు సిడ్నీలో శాశ్వత నివాసం

ఏపీలో కొత్తగా ఏడు కోవిడ్ కేసులు.. 26కి చేరిన యాక్టివ్ కేసుల సంఖ్య

ఇందిరమ్మ గృహాలకు ఆధార్ లింక్ తప్పనిసరి : తెలంగాణ సర్కార్ ఆదేశం

భార్య, పిల్లల నోటికి ప్లాస్టర్ అంటించి గొంతునులిమి హత్య చేసిన భర్త.. ఆపై తాను కూడా..

ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచార యత్నం

అన్నీ చూడండి

ఆ పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఆరోగ్యంగానే ఉన్నాను : అమితాబ్

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

Prabhas: స్పిరిట్ పంపిణీ కోసం పీపుల్ మీడియా, ఏషియన్ సురేష్ భాగస్వామ్యం

Priyadarshi: ఈ కథ విన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది : ప్రియదర్శి

Vijay: ఒకేలా బతకడానికి ఇంత పెద్ద జన్మ ఎందుకు? అనేది నాకు స్పూర్తి : వెంకట్ కె. నారాయణ

తర్వాతి కథనం
Show comments