suvichar

నిమ్మరసం, పాలు సమంగా కలిపి అక్కడ మృదువుగా మర్దన చేస్తే...

Written By సిహెచ్
Updated: బుధవారం, 8 మే 2019 (22:21 IST)
కొందరిలో ముఖంపై మంగుమచ్చలు వచ్చి ముఖం అందవికారంగా ఉండడం వలన మానసిక వేదనను అనుభవిస్తుంటారు. అవి ప్రమాదకరమైనవి కాదు, ఒకరి నుండి మరొకరికి వ్యాపించవు. జన్యు సంబంధ కారాణాల వల్ల, సూర్యరశ్మి ప్రభావం వల్ల మరియు హార్మోన్ల ప్రభావం వల్ల ఈ మంగు మచ్చలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మనం వాడే కొన్ని రకాల మందుల వల్ల కూడా ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే సరి.
 
1. నిమ్మరసం, పాలు సమంగా కలిపి మచ్చలపై మృదువుగా మర్దనా చేయాలి. అలా తరచూ చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
 
2.గులాబీ పూల పొడిలో తగినంత నిమ్మరసం చేర్చి పట్టిస్తూ ఉన్నట్లయితే క్రమంగా మచ్చలు పోతాయి.
 
3.ఉసిరిక పెచ్చుల పొడి, పసుపు సమానంగా కలిపి సేవిస్తున్నా మంగు మచ్చలు తగ్గుముఖం పడతాయి.
 
4. రాత్రిపూట 50 మి.లీ నీటిలో ఒక గ్రాము వేప బెరడు పొడి వేసి ఉదయాన్నే వడకట్టి 5 మి.లీ తేనె కలుపుకుని తాగినట్లయితే మంగు మచ్చలకు మంచి ఔషధంలా పని చేస్తుంది.
 
5. ఒక భాగం శ్రీ గంధం పొడిలో దానికి రెట్టింపు బొప్పాయి గుజ్జుని చేర్చి బాగా కలిపి మంగు మచ్చలు ఉన్న చోట రాయాలి. ఇలా చేయడం వలన మంగు మచ్చలు తగ్గుతాయి.

అన్నీ చూడండి

ఏయ్ దూరం పాటించు అని చెప్పిన మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టాడు, వీడియో

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్‌ను పట్టిస్తే 70 లక్షల పాక్ రూపాయలు

మహిళతో వివాహేతర సంబంధం - రూ.29 కోట్ల నిధుల దుర్వినియోగం - అరెస్టు

ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ తొలి పూజ... సీఎం చంద్రబాబు నివాసంలో చవితి వేడుకలు

మద్యం మత్తులో మహిళా బైకరును వేధించిన అకతాయిలు..

అన్నీ చూడండి

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

తర్వాతి కథనం
Show comments