పాల పౌడర్‌తో చర్మం మెరిసిపోతుంది.. ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుసా?

చర్మం శుభ్రపడి కాంతివంతంగా కనిపించాలంటే.. అరచెక్క నిమ్మరసం పిండి, దానికి కాస్త పాలపొడి, చెంచా చొప్పున తేనె, పంచదార కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని మృదువుగా రుద్దుకుంటే చర్మంపై ఉండి మురికి

సోమవారం, 22 ఆగస్టు 2016 (12:36 IST)
పార్టీకి వెళ్ళాలా? చిటికెలో చర్మాన్ని నిగారింపుగా మార్చే సౌందర్య చిట్కాలు ఇవిగోండి. 
 
* చర్మం శుభ్రపడి కాంతివంతంగా కనిపించాలంటే.. అరచెక్క నిమ్మరసం పిండి, దానికి కాస్త పాలపొడి, చెంచా చొప్పున తేనె, పంచదార కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని మృదువుగా రుద్దుకుంటే చర్మంపై ఉండి మురికి, మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా తయారవుతుంది. 
 
* కంటి కిందటి నల్లటి చారలు ఏర్పడి, చర్మం సాగినట్లు అనిపిస్తే కోడిగుడ్డలోని తెల్లసొన రాసి పదినిమిషాల తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే సరి. చర్మం బిగుతుగా మారి కళ్లు కాంతిమంతంగా కనిపిస్తాయి. నల్లటి వలయాలు ఉన్నప్పుడు బంగాళాదుంపను గుజ్జుగా చేసి దానికి కాసిని పాలు కలిపి కంటి కింద పూతలా వేయాలి. ఇలా కనీసం రోజు విడిచి రోజు చేస్తుంటే అవీ క్రమంగా తగ్గుముఖం పడతాయి.
 
* అలాగే విటమిన్ ఇ పుష్కలంగా గల బాదం నూనెలో, రెండు చుక్కల తేనె కలిపి ముఖానికి పట్టించాలి. పావుగంట పాటు ఆరనిచ్చి గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. 

అన్నీ చూడండి

ఆంధ్ర ప్రజలకు హెచ్చరిక, ఆ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు, జాగ్రత్త

Annamalai: బీజేపీకి బైబై చెప్పనున్న అన్నామలై

పవన్ కళ్యాణ్ జనసేన సమావేశానికి పోలీసుల అనుమతి నిరాకరణ

రాజ్యసభకు వైఎస్ షర్మిల నామినేషన్ ఖరారు

27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

అన్నీ చూడండి

Shalini: సింగ్ గీతం లో విలన్ క్యారెక్టర్ చేశాను. మాటే పాటగా మారే కథ ఇది : శాలిని కొండెపుడి

Sunitha: భానుచందర్, సునీత, సి కళ్యాణ్ ఆవిష్కరించిన కొత్త మలుపు ట్రైలర్

SV Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి మ్యూజిక్ కు వరల్డ్ రికార్డ్ గుర్తింపు దక్కింది

Janhvi Kapoor : సినిమా అనేది ప్రజలకు చేసే సేవ : జాన్వీ కపూర్

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ చిత్రం ఇరుముడి గ్లింప్స్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments