పిల్లలకు పండ్లు తినడం అలవాటు చేయడం ఎలా?

గురువారం, 22 జనవరి 2015 (14:44 IST)
పిల్లలు పండ్లు తినడం లేదంటూ తల్లిదండ్రులు బాధపడిపోతుంటారు. అందుకే పిల్లలకు నచ్చే విధంగా ఫ్రూట్స్ ఇచ్చినా.. ప్రస్తుతం మోజంతా విదేశీ ఫ్రూట్స్ పైనే పడింది. మనదేశంలో బోలెడు పండ్లుండగా, పిల్లలు స్ట్రాబెర్రీ, లిచి, కివి వంటి పండ్లను తీసుకునే ఆసక్తి చూపుతున్నారు. 
 
కానీ పిల్లలు ఏ పండ్లు తినిపించాలని తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. పిల్లలకు రోజుకో పండును ఇవ్వాలి. అరటిలోనే అధిక కెలోరీలు ఉన్నాయి. పిల్లలు లావెక్కకపోతే.. గ్రీన్ బనానా, కేరళ అరటిపండు ఇవ్వడం మంచిది. ఇచ్చే పండులో రసాయనాలు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. 
 
అరటి, జామ, బొప్పాయి, దానిమ్మ పండ్లను పిల్లలకు తినిపించవచ్చు. ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్ వంటి పండ్లు తాజాగా ఉండేందుకోసం రసాయనాలు కలుపుతారు. వీటిని చాలామటుకు తగ్గించడం మంచిది. లేదంటే పండ్లను శుభ్రంగా కడిగి ఆ తర్వాతే కట్ చేసుకుని తినాలి. 
 
ఆపిల్, ఆరెంజ్ పండ్లలో కెలోరీలు తక్కువ కాబట్టి బరువు ఎక్కువగా గల పిల్లలకు ఇవ్వొచ్చు. పండ్లను జ్యూస్‌ల రూపంగా కాకుండా అలాగే తినడం అలవాటు చేయాలి. పండ్లతో పాటు తగిన ఆహారం ఇవ్వాలి. పిల్లల్ని ఆడుకోనివ్వాలి. అప్పుడే పిల్లలు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎదుగుతారని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 

అన్నీ చూడండి

పుచ్చకాయలు తిన్న తండ్రీకొడుకులు, తండ్రి మృతి, కొడుకు పరిస్థితి విషమం

ఏసీ స్లీపర్ బస్సులో మంటలు.. తొక్కిసలాటలో సీటు కిందకి చిన్నారి.. సజీవ దహనం

Revanth in National Politics: 2034 వరకు సీఎం.. ఆ తర్వాత జాతీయ రాజకీయాలు.. రేవంత్ రెడ్డి

Bandi Sai Bageerath: బండి సాయి భగీరథ్‌కు పోలీసుల లుక్ అవుట్ నోటీసు

ఆ వేదిక కేవలం అమ్మాయిల కోసమే.. మగాళ్ళు లింగ మార్పిడి చేయించుకున్నారా... ఏంటి? ఎలాన్ మస్క్

అన్నీ చూడండి

ప్రకృతి గొప్పతనాన్ని తెలియజెప్పే కాన్సెప్ట్ తో జంగిల్ బుగి రియాల్టీ షో

విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ (Video)

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే సమ్మర్ హాలిడేస్

Prasanth Varma: తేజ సజ్జ హనుమాన్ చిత్రం 3డిలో రీరిలీజ్ కాబోతోంది

'జయం' రవితో కెనీషా ఫ్రాన్సిస్ బ్రేకప్ - ఫెమినిజం గెలిచింది.. ఆనందం ఓడిపోయింది..

Show comments