త‌గ్గిన‌ట్లే త‌గ్గి పెరుగుతున్న క‌రోనా, త‌స్మాత్ జాగ్ర‌త్త‌

శనివారం, 10 జులై 2021 (13:02 IST)
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేసులు, మరణాలు తగ్గినట్టే తగ్గి, మ‌ళ్ళీ పెరుగుతున్నాయి. తాజాగా 42,766 మందికి కరోనా సోకింది. గత కొన్ని రోజులుగా వెయ్యికి దిగువనే నమోదవుతోన్న మరణాలు నిన్న భారీగా పెరిగాయి. తాజాగా 1,206 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మొత్తం కేసులు 3,07,95,716కి చేరగా, 4,07,145 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. నిన్న 19,55,225 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్రం వెల్లడించింది.
 
ఇక 24 గంటల వ్యవధిలో 45,254 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.99 కోట్లకు చేరగా.. ఆ రేటు 97.20 శాతానికి పెరిగింది. ప్రస్తుతం 4,55,033 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.48 శాతానికి తగ్గింది. మరోపక్క నిన్న 30,55,802 మంది టీకాలు తీసుకున్నారు.

ఇప్పటివరకు పంపిణీ అయిన డోసులు సంఖ్య 37కోట్ల మార్కును దాటింది. అయినా మ‌ళ్ళీ క‌రోనా పెరిగే అవ‌కాశం ఇవ్వ‌కుండా ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగానే ఉండాల‌ని వైద్య ఆరోగ్య శాఖ కోరుతోంది. క‌రోనా నియ‌మాల‌ను పాటించాల‌ని వైద్య‌నిపుణులు చెపుతున్నారు.

అన్నీ చూడండి

Tamannaah: పసుపు గౌనులో గోల్డెన్ బ్యూటీ అవార్డు గెలుచుకున్న తమన్నా భాటియా

Pooja Hegde :వర్షం, పర్వత ప్రాంత ప్రార్థనాల మధ్య దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే చిత్రం షూట్

Laya: జగపతి బాబు, లయల మధ్య ఫ్యామిలీ కెమిస్ట్రీ తో వదలా నుంచి మెలోడీ సాంగ్

Sunil : పుష్ప తర్వాత నా లైఫ్ సర్‌ప్రైజింగ్ మోడ్‌లో పడింది. : సునీల్

Manoj Manchu: సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్ ను స్వీకరించిన మనోజ్ మంచు

తర్వాతి కథనం
Show comments