కోవిడ్-19 మహమ్మారి ప్రభావం నుంచి జనజీవనం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్టు కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ వైరస్ బారినపడిన వారిపై అది చూపుతున్న ప్రభావం మాత్రం తగ్గుతూ వస్తున్నట్టు కనిపిస్తోందని వైద్యులు కూడా అంగీరిస్తున్నారు. అదే సమయంలో కోవిడ్ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది.