ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి - చిత్తూరులో 1,534 కేసులు

మంగళవారం, 18 జనవరి 2022 (18:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పతాక స్థాయికి చేరిందని చెప్పాలి. గత 24 గంటల్లో ఏకంగా 6 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఒక్క చిత్తూరు జిల్లాలోనే 1,534 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. 
 
ఇందులో గడిచిన 24 గంటల్లో 38,055 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా, ఇందులో 6,996 మందికి కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఏకంగా 1,534 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో విశాఖపట్టణం 1,263 కేసులు, గుంటూరులో 758, శ్రీకాకుళంలో 573 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ఇదిలావుంటే, గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ సోకడం వల్ల నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 1,066 మంది కోలుకున్నారు. దీంతో కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,514కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,17,384 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20,66,762 మంది ఈ వైరస్ నుంచి విముక్తులయ్యారు. 

అన్నీ చూడండి

అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో పళ్ళబురుసు చిత్రం ప్రకటన

Dixith Shetty :దీక్షిత్ శెట్టి, శశి ఓదెల చిత్రానికి #KJQ (కింగ్ జాకీ క్వీన్) పేరు ఖరారు

Fauji Poster Controversy: ఫౌజీ రిలీజ్ డేట్ పోస్టర్ లో ప్రభాస్ కాలి వేళ్లపై అభిమానుల్లో రచ్చ ?

Samantha: చిత్తూరులో సమంతకు సీమంతం

అల్లు అర్జున్ క్యాంప్ నుంచి మరో నిర్మాత శరత్‌చంద్ర నాయుడు

తర్వాతి కథనం
Show comments