ధోనీ - కోహ్లీలకు కూడా సాధ్యంకాని అరుదైన రికార్డు రోహిత్ సొంతం

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (15:35 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలకు కూడా సాధ్యంకాని అరుదైన రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు. టెస్ట్ క్రికెట్, వన్డేలు, టీ20 ఫార్మెట్లలో కలిపి సెంచరీలు సాధించిన భారత ఏకైక కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘనతను సాధించిన నాలుగో కెప్టెన్‌గా మారింది. 
 
కెప్టెన్‌గా టెస్ట్, వన్డే, టీ20 మూడు ఫార్మెట్లలో సెంచరీలు చేశాడు. భారత కెప్టెన్లలో మెరవరూ ఈ ఘనతను సాధించలేక పోయారు. కెప్టెన్‌గా మూడు ఫార్మెట్‌లలో సెంచరీలు చేసిన ఘనతను ఇప్పటివరకు వరకు ముగ్గురు కెప్టెన్లు సాధించారు. వీరిలో శ్రీలంక మాజీ కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఉన్నారు. 
 
ఇపుడు వీరి సరసన రోహిత్ శర్మ కూడా చేరారు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. రోహిత్ 212 బంతుల్లో 15 ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 120 రన్స్ చేసి తన వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఆ తర్వాతృ కమ్మిన్స్ బౌలింగ్‌‌లో ఔట్ అయ్యాడు. 

అన్నీ చూడండి

జూలై 23, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

కుమారుడుని తప్పించబోయి ఇరుక్కున్న మాజీ మంత్రి సీదిరి అరెస్టు

కోడిచెరువును పవన్ కబ్జా చేసారన్నవారు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారో?!!

నీట్ పరీక్షా పత్రాలు మూడుసార్లు లీక్.. ప్రభుత్వం ఎందుకు సైలెంట్‌గా వుంటోంది.. అన్నామలై

సిటీస్ ఆన్ ది రైజ్ 2026: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కెరీర్ హబ్‌లలో విశాఖపట్నం, విజయవాడ

అన్నీ చూడండి

అబ్జెక్ష‌న్ మై లార్డ్‌కు అండగా మెగాస్టార్ చిరంజీవి

Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ

Rahul Sipligunj : బైక్ రైడర్ సీటులో దారిచూపిన వ్యక్తి అంటూ ఆనందక్షణాలతో రాహుల్ సిప్లిగంజ్‌

Prashanth Neel : డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది

Allari Naresh :సురభి తో నా కంటి మీద కునుకే లేదంటున్న అల్లరి నరేష్

తర్వాతి కథనం
Show comments