త్వరలోనే దేశ వ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్ సేవలు : ముఖేష్ అంబానీ

సోమవారం, 29 ఆగస్టు 2022 (15:30 IST)
రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం సోమవారం ముంబై వేదికగా జరిగింది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే 5జీ నెట్‌వర్క్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. 
 
వందకు వంద శాతం స్వదేశీయంగా తయారైన 5జీ సొల్యూషన్‌ను పరీక్షించామని, ఈ పరీక్షలో 1జీబీపీఎస్ స్పీడ్‌ను విజయవంతంగా అందుకున్నట్టు చెప్పారు. జియో 5జీ నెట్‌వర్క్‌ సేవలు ప్రారంభించేందుకు రెగ్యులేటరీ అనుమతులు కూడా వచ్చాయని తెలిపారు. 
 
ఇపుడు 5జీ ఫీల్డ్ కసరత్తులు చేస్తున్నామని తెలిపారు. దేశీయంగా తామే తొలుత 5జీ సేవలు అందుబాటులోకి తెస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వైద్య రంగంలో కూడా 5జీ సేవలు ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. 
 
దీంతో పాటు విద్యా రంగంలో కూడా 5జీ సేవలన్ని అందిస్తామని తెలిపారు. గూగుల్‌తో కలిసి తయారు చేసిన జియో ఫోన్ నెక్స్ట్‌ వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 10వ తేదీన విడుదల చేస్తామని ఆయన తెలిపారు. 

అన్నీ చూడండి

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

తర్వాతి కథనం
Show comments