త్వరలోనే దేశ వ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్ సేవలు : ముఖేష్ అంబానీ

Written By ఠాగూర్
Updated: సోమవారం, 29 ఆగస్టు 2022 (15:42 IST)
రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం సోమవారం ముంబై వేదికగా జరిగింది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే 5జీ నెట్‌వర్క్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. 
 
వందకు వంద శాతం స్వదేశీయంగా తయారైన 5జీ సొల్యూషన్‌ను పరీక్షించామని, ఈ పరీక్షలో 1జీబీపీఎస్ స్పీడ్‌ను విజయవంతంగా అందుకున్నట్టు చెప్పారు. జియో 5జీ నెట్‌వర్క్‌ సేవలు ప్రారంభించేందుకు రెగ్యులేటరీ అనుమతులు కూడా వచ్చాయని తెలిపారు. 
 
ఇపుడు 5జీ ఫీల్డ్ కసరత్తులు చేస్తున్నామని తెలిపారు. దేశీయంగా తామే తొలుత 5జీ సేవలు అందుబాటులోకి తెస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వైద్య రంగంలో కూడా 5జీ సేవలు ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. 
 
దీంతో పాటు విద్యా రంగంలో కూడా 5జీ సేవలన్ని అందిస్తామని తెలిపారు. గూగుల్‌తో కలిసి తయారు చేసిన జియో ఫోన్ నెక్స్ట్‌ వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 10వ తేదీన విడుదల చేస్తామని ఆయన తెలిపారు. 

అన్నీ చూడండి

Rithika Nayak : అందుకే కొరియన్ కనకరాజు లో నటించానికి అంగీకరించా : రితిక నాయక్

Faria Abdullah: తిరువీర్, ఫరియా అబ్దుల్లా పై సిత్తరాల నవ్వు సాంగ్

Action King Arjun: యాక్షన్ కింగ్ అర్జున్.ఎంట్రీతో పొలిమేర ప్రారంభం

నటి లావణ్యపై బాడీ షేమింగ్ : అండగా నిలిచిన మెగా ఫ్యాన్స్

కృత్రిమ మేధతో విద్యారంగానికి పెను ముప్పు : రాంగోపాల్ వర్మ

తర్వాతి కథనం
Show comments