1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
  4. Chant this mantra on deepavali festival

దీపావళి రోజున ఈ మంత్రాన్ని జపిస్తే?

Diwali 2020
దీపావళి శుభాకాంక్షలు ఎలా చెప్పాలంటే.. ఉదయాన్నే లేచి స్నానమాచరించి బంధువులకు, సన్నిహితులకు పిండివంటలతో పాటు శ్రీ లక్ష్మీ స్తోత్ర పుస్తకాలు ఇవ్వాలి. దీపావళి నాడు ఇలా చేయడం వలన లక్ష్మీ కటాక్షం వనగూరుతుందని విశ్వాసం. బాకీల నుండి విముక్తి పొందాలంటే.. ఈ పండుగ నాడు శ్రీలక్ష్మీదేవికి నిత్యపూజలు లేదా శ్రీ ధనలక్ష్మీ నిత్య పూజలు చేయవలసి వుంటుంది.
 
ఈ రోజు లక్ష్మీదేవి కుబేర వ్రతాన్ని ఆచరించి సుమంగళి స్త్రీలకు ఇంటికి విచ్చేసే వారికి పసుపు, కుంకుమలతో పాటు వస్త్రాదులను దానం చేయాలి. ఇలా చేయడం వలన సకల సంపదలు, సౌభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం. ఇక.. దీపావళి రోజు ఆలయాల్లో జరిపే శ్రీ మహాలక్ష్మీ కోటి కుంకుమార్చన, శ్రీ మహాలక్ష్మీకి 108 కలువ పువ్వులతో పూజలు చేస్తే పుణ్యం లభిస్తుందని విశ్వాసం. 
 
వెండితో తయారుచేసిన దీపాలలో ఆవునెయ్యి వేసి తామరవత్తులతో దీపాలను వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇదే రోజున సాయంత్రం ఆరుగంటల సమయంలో నుదుట కుంకుమను దిద్దుకుని, పూజగదిలో రెండు పంచముఖ దీపపు సెమ్మెలలో తామర వత్తులను అమర్చి వెలిగించాలి. తరువాత ఇంటి నిండా దీపాలు వెలిగించి ఓం మహాలక్ష్మీ దేవ్వ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ మంత్రాన్ని స్మరించడం వలన ఆ గృహం ఎల్లప్పుడూ ఆనందాలతో వెల్లువిరుస్తుందని విశ్వాసం.
About Writer
సిహెచ్