కంటిచూపును మెరుగుపరిచే చేపలతో పకోడీలు చేసేద్దామా?

ఒక పాన్‌ తీసుకుని కోడిగుడ్లను గిలకొట్టి అందులో ఉప్పు, కారం, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కార్న్‌ఫ్లోర్ వేసి మరికాసేపు కలుపుకోవాలి. ఇందులోనే శుభ్రం చేసి వుంచిన చేప ముక్కల్ని కలు

Written By Selvi
Updated: శనివారం, 8 ఏప్రియల్ 2017 (11:39 IST)
వారానికి రెండు సార్లు చేప‌ల‌ను తింటే దాంతో డ‌యాబెటిస్ దూరం అవుతుంది. ఇంకా గర్భంతో ఉన్న వాళ్లు చేపలు తింతే బాగా తెలివైన పిల్లలు పుడతారని, కంటిచూపును కూడా మెరుగుపరుచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాంటి చేపలతో కూర, ఫ్రైలు కాకుండా పకోడీలు ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు:
చేప ముక్కలు - రెండు కప్పులు
కోడిగుడ్లు -  మూడు
కార్న్‌ఫ్లోర్ - మూడు స్పూన్లు
కారం -  రెండు టీ స్పూన్లు
కొత్తిమీర - ఒక కట్ట
ఉప్పు, నూనె - తగినంత
నిమ్మరసం - 2 స్పూన్స్
 
తయారు చేసే విధానం :
ఒక పాన్‌ తీసుకుని కోడిగుడ్లను గిలకొట్టి అందులో ఉప్పు, కారం, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కార్న్‌ఫ్లోర్ వేసి మరికాసేపు కలుపుకోవాలి. ఇందులోనే శుభ్రం చేసి వుంచిన చేప ముక్కల్ని కలుపుకోవాలి. చేప ముక్కలకు మసాలా బాగా అంటేలా చేసుకోవాలి. అర్థగంట పాటు ఈ మిశ్రమాన్ని పక్కనబెట్టేయాలి. ఆపై స్టౌ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడయ్యాక ఒక్కో ముక్కను కార్న్‌ఫ్లోర్ మిశ్రమంలో ముంచి దోరగా వేపుకోవాలి. ఈ వేయించిన చేప ముక్కల్ని గ్రీన్ చట్నీతో వేపుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది. 

అన్నీ చూడండి

స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ స్కామ్ : నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

కేజీ బంగారాన్ని కొట్టేసిన సోదరులు.. జ్యువెలరీ షాపుకు కన్నం వేసి..?

ఛార్జింగ్ అవుతున్న ఫోన్ పేలడంతో 14 ఏళ్ల బాలుడి మృతి

జూలై 23, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

కుమారుడుని తప్పించబోయి ఇరుక్కున్న మాజీ మంత్రి సీదిరి అరెస్టు

అన్నీ చూడండి

అబ్జెక్ష‌న్ మై లార్డ్‌కు అండగా మెగాస్టార్ చిరంజీవి

Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ

Rahul Sipligunj : బైక్ రైడర్ సీటులో దారిచూపిన వ్యక్తి అంటూ ఆనందక్షణాలతో రాహుల్ సిప్లిగంజ్‌

Prashanth Neel : డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది

Allari Naresh :సురభి తో నా కంటి మీద కునుకే లేదంటున్న అల్లరి నరేష్

తర్వాతి కథనం
Show comments