ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

సిహెచ్
శుక్రవారం, 21 మార్చి 2025 (21:37 IST)
మర్రిచెట్టు ఊడలను చూస్తేనే చాలామందికి ఒళ్లు జలదరిస్తుంది. అంతేకాదు... మర్రిచెట్టుపైన దెయ్యాలు, భూతాలు వుంటాయంటూ ఇదివరకు చందమామ కథల్లో రాసేవారు. వాస్తవానికి దెయ్యాలు, భూతాలు వుంటాయో లేదో తెలియదు కానీ పెద్దపెద్ద ఊడలతో విస్తరించి వుండే మర్రిచెట్టును చూస్తే మాత్రం కొందరికి నిజంగానే భయం వేస్తుంది.
 
ఇక అసలు విషయానికి వస్తే... ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు మన భారతదేశంలోనే వున్నది. దీని వయసు 250 ఏళ్లు. హౌరాలోని శివపూర్ బొటానికల్ గార్డెన్‌లో ఇది వుంది. ఈ చెట్టు సుమారు 5 ఎకరాలపై విస్తరించి వుంది. వందలకొద్ది కొమ్మలతో, మర్రి ఊడలతో కనిపించే ఈ చెట్టు 486 మీటర్ల లావుగానూ, 24.5 మీటర్ల ఎత్తులో వుంది.
 
బ్రిటిష్ కాలంలో ఈ మర్రిచెట్టు వున్న ప్రాంతానికి రాయల్ ఇండియన్ బొటానికల్ గార్డెన్ అని నామకరణం చేసారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇండియన్ బొటానికల్ గార్డెన్ అయ్యింది. ఆచార్య జగదీష్ చంద్రబోస్ 150వ జయంతిని పురస్కరించుకుని ఈ బొటానికల్ గార్డెన్ పేరును ఆచార్య జగదీష్ చంద్రబోస్ బొటానికల్ గార్డెన్ అని పేరు పెట్టారు. అప్పట్లో 310 ఎకరాల్లో విస్తరించి వుండే ఈ బొటానికల్ గార్డెన్ ప్రస్తుతం 40 ఎకరాలకు పడిపోయింది.

అన్నీ చూడండి

హైదరాబాద్‌లో ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ కార్యకలాపాల విస్తరణ

ఆంధ్రప్రదేశ్‌లో రుణ వితరణ: రూ.393.17 కోట్ల రుణాలను మంజూరు చేసిన కెనరా బ్యాంక్, రూ. 36.85 లక్షల సీఎస్ఆర్ సాయం

వందేమాతరాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలుశిక్ష : కేంద్రం

నెలకు ఇంటి అద్దె రూ.80 వేలు.. అయినా క్యాబ్ డ్రైవర్

నిలకడగా వాంగ్‌చుక్ ఆరోగ్యం... కాక్రోచ్ మార్చ్‌ను విజయవంతం చేయాలంటూ పిలుపు

అన్నీ చూడండి

'రామాయణం' చిత్రం కాదు.. భారత్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తే ప్రయాణం : రకుల్ ప్రీత్ సింగ్

అవకాశాల కోసం దిగజారను : కాజల్ అగర్వాల్

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న బ్రహ్మయుగం

New Delhi: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడింది

L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments