అల్పాహారం తీసుకోకపోతే.. ఇవైనా తినాలట..!?

Written By సెల్వి
Updated: మంగళవారం, 22 అక్టోబరు 2019 (12:06 IST)
అల్పాహారం తీసుకోనప్పుడు రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఇది దీర్ఘకాలం కొనసాగితే టైప్2 మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటి బారిన పడే ప్రమాదం ఉంది. ఇంట్లో సమయానికి తినకపోవడం వల్ల బయటి ఆహారం మీదకు మనసు లాగుతుంది. అలా బయట తిండికి అలవాటు పడితే త్వరగా బరువు పెరిగే ప్రమాదం ఉంది.
 
ఎప్పుడైనా అల్పాహారాన్ని మానేసినప్పుడు ఎక్కువ నీళ్లు తాగడం, క్యారెట్లూ, కీరదోస ముక్కల వంటివి తినడం అలవాటు చేసుకోవాలి. జీడిపప్పూ, బాదం, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు ఆఫీసులో ఉంచుకోవాలి. ఏమీ తినకుండా వచ్చిన రోజు వాటిని తింటే శక్తి లభిస్తుంది. లేదంటే ఆకలి వల్ల మెదడు పని తీరు సన్నగిల్లుతుంది. పనిమీద ఏకాగ్రత ఉండదు. రోజంతా ఆ ప్రభావం ఉంటుంది.
 
అలాగే అల్పాహారంలో ఆకుకూరలను ఆహారంలో తీసుకొంటే మంచిది. జ్యూస్‌లకు బదులుగా పండ్లు తీసుకోవాలి. వాటిని సలాడ్స్‌ రూపంలో తీసుకుంటే ఇంకా మంచిది. ఆకలితో ఉండకుండా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తినాలి. అంతేకానీ ఒకేసారి ఎక్కువగా తినకూడదు.

అన్నీ చూడండి

మరింతగా పడిపోయిన భారత పాస్‌పోర్టు

బొద్దింక జనతా పార్టీ నిరసనల్లో అసభ్య పదజాలం ఉపయోగిస్తూ, తాకుతూ కొందరు, వీడియో

విద్యార్థుల ఆందోళనకు స్టాలిన్ మద్దతు - నీట్ రద్దు చేయాలంటూ డిమాండ్

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య

Gudivada: కొడాలి నాని సహాయకుడి బర్త్‌డే పార్టీపై దాడి, మద్యం స్వాధీనం

అన్నీ చూడండి

విజయ్ నటించిన జననాయగన్‌ను తల్లితో కలిసి వీక్షించిన త్రిష

Romanchakam :సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రోమాంచకం రాబోతోంది

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఫైనల్.. ట్రైలర్ విడుదల

Jana Nayakudu review :ఇద్దరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ల కథతో జన నాయకుడు..రివ్యూ

ఆ ఒక్క కారణంతో బిగ్ బాస్ అవకాశాన్ని వదులుకున్నా : సత్యశ్రీ

తర్వాతి కథనం
Show comments