Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్పాహారం తీసుకోకపోతే.. ఇవైనా తినాలట..!?

Written By సెల్వి
Updated: మంగళవారం, 22 అక్టోబరు 2019 (12:06 IST)
అల్పాహారం తీసుకోనప్పుడు రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఇది దీర్ఘకాలం కొనసాగితే టైప్2 మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటి బారిన పడే ప్రమాదం ఉంది. ఇంట్లో సమయానికి తినకపోవడం వల్ల బయటి ఆహారం మీదకు మనసు లాగుతుంది. అలా బయట తిండికి అలవాటు పడితే త్వరగా బరువు పెరిగే ప్రమాదం ఉంది.
 
ఎప్పుడైనా అల్పాహారాన్ని మానేసినప్పుడు ఎక్కువ నీళ్లు తాగడం, క్యారెట్లూ, కీరదోస ముక్కల వంటివి తినడం అలవాటు చేసుకోవాలి. జీడిపప్పూ, బాదం, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు ఆఫీసులో ఉంచుకోవాలి. ఏమీ తినకుండా వచ్చిన రోజు వాటిని తింటే శక్తి లభిస్తుంది. లేదంటే ఆకలి వల్ల మెదడు పని తీరు సన్నగిల్లుతుంది. పనిమీద ఏకాగ్రత ఉండదు. రోజంతా ఆ ప్రభావం ఉంటుంది.
 
అలాగే అల్పాహారంలో ఆకుకూరలను ఆహారంలో తీసుకొంటే మంచిది. జ్యూస్‌లకు బదులుగా పండ్లు తీసుకోవాలి. వాటిని సలాడ్స్‌ రూపంలో తీసుకుంటే ఇంకా మంచిది. ఆకలితో ఉండకుండా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తినాలి. అంతేకానీ ఒకేసారి ఎక్కువగా తినకూడదు.

అన్నీ చూడండి

వల్లభనేని వంశీని ఇబ్బందుల్లోకి నెట్టిన కొడాలి నాని? ఎలాగంటే?

సెప్టెంబర్ నెలలో ఎండల తీవ్రత.. ఉక్కపోత.. వర్షాలు కురిసినా ఉష్ణోగ్రతలు...?

న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సమావేశం.. ప్రపంచ నాయకుల జాబితా ఇదే

Heavy Rain Alert: తెలంగాణలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలకు అవకాశం

విశాఖలో అగ్నికి ఆహుతైన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికు సంగతేంటి?

అన్నీ చూడండి

Kaka Latest: బాధ్యతల గల పాత్రగా కాకా ని మలుస్తున్న బాబీ కొల్లి - చిరంజీవిపై కీలక సన్నివేశాలు

Balakrishna's entry : దాదా షూటింగ్ లో నందమూరి బాలక్రిష్ణ ఎంట్రీ - కలెక్టర్ గా కాజల్ అగర్వాల్

Nani: శ్రీకాంత్ మొండితనం వల్లే ప్యారడైజ్ ఆలస్యం అయింది : న్యాచురల్ స్టార్ నాని

Avengers: Endgame : అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్ : బుకింగ్స్ ఓపెన్

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం ఆదర్శ కుటుంబం టీజర్ వాయిదా

తర్వాతి కథనం
Show comments