రాత్రిపూట అధికంగా తినేస్తే ఏమవుతుందో తెలుసా?

శరీర శ్రమ పూర్తిగా తగ్గిపోయిన ఈ కాలంలో ముప్పూటలా ఫుల్లుగా తింటే ముప్పేనంటున్నారు. టెక్నీషియన్లు... ప్రత్యేకించి రాత్రివేళ అతిగా తినేసే అలవాటు స్థూలకాయం రావడానికి, అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలు తలెత్తడానికి కారణం అవుతుందని చెపుతున్నారు. ఆరోగ్య శాస్త్

శనివారం, 6 మే 2017 (19:42 IST)
శరీర శ్రమ పూర్తిగా తగ్గిపోయిన ఈ కాలంలో ముప్పూటలా ఫుల్లుగా తింటే ముప్పేనంటున్నారు. టెక్నీషియన్లు... ప్రత్యేకించి రాత్రివేళ అతిగా తినేసే అలవాటు స్థూలకాయం రావడానికి, అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలు తలెత్తడానికి కారణం అవుతుందని చెపుతున్నారు. ఆరోగ్య శాస్త్రం ప్రకారం, ఉదయం తిన్న ఆహారం మోతాదులో సగం మధ్యాహ్నం, ఇందలో సగం రాత్రివేళ తినాలి. ఎందుకంటే సూర్య గమనానికి జీర్ణశక్తికీ సంబంధం వుంది. సూర్యోదయం వేళ వుండే జీర్ణశక్తిలో 60 శాతమే రాత్రివేళ వుంటుంది. 
 
భోజనం మోతాదు కూడా అదే నిష్పత్తిలో తగ్గుతూ రావాలి. కానీ, ఉద్యోగ వ్యాపారాల ఒత్తిళ్లు కారణంగా ఉదయం, మధ్యాహ్నం హడావుడిగా తినేస్తారు. రాత్రివేళ ఆ ఒత్తిళ్లు పెద్దగా ఉండకపోవడం వల్ల మనసు కూడా కుదురుగా ఉండి ఎక్కువగా తినేస్తుంటారు. ఏక భుక్తం యోగి, ద్విభక్తం భోగి, త్రిభుక్తం రోగి అన్న ఆరోగ్య సూత్రం ఒకటి వుంటుంది. 
 
వ్యాయామాలు, శరీర శ్రమ అసలే లేకుండా పోయిన ఈ దశలో ఉదయం, మధ్యాహ్నం చేసిన భోజనాల్లోని కేలరీలే శరీర పోషణకు సరిపోతాయి. అయినా అంతటితో ఆగక మూడోసారి కూడా తినేసిన తాలూకు కేలరీలు శరీరంలో అదనంగా ఉండిపోతాయి. అందుకో భోజనానంతరం తీసుకున్న ఆహారం ద్వారా వచ్చే కేలరీలు లేని కీర దోస లాంటివి లేదా అతి తక్కువ కేలరీలున్న ఆహార పదార్థాలుగానీ తీసుకోవడం మేలు. డిన్నర్ లో తీసుకునే ఆహార పదార్థాలు ఎక్కువ పీచు పదార్థం తక్కువ క్యాలరీలతో వుండేలా చూసుకోవాలి.

అన్నీ చూడండి

తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసు: ఏడుగురు అధికారులపై క్రమశిక్షణా చర్యలు

ముఖ్యమంత్రి హోదాలో హస్తినకు విజయ్ ... నేడు ప్రధానితో భేటీ

కర్నాటక కాంగ్రెస్‌లోఅనూహ్య పరిణామాలు : సీఎం పదవికి రాజీనామా చేయనున్న సిద్ధరామయ్య...?

నీటి హైసింత్ వల్ల ప్రభావితమైన నీటి వనరులు.. మహిళలకు జీవనోపాధి.. ఎలా?

తెలంగాణలో నో ఎబోలా.. విమానాశ్రయం, ఆస్పత్రుల్లో కట్టుదిట్టమైన నిఘా

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments