వేసవిలో మినుములు, పెసలు, బియ్యంతో ఫేస్ ప్యాక్ ఇలా?

వేసవిలో చర్మ సమస్యలను దూరం చేసుకోవాలంటే మినుములు, పెసలు, బియ్యాన్ని ఉపయోగించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మినుములు, పెసళ్లు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇంకా శరీర ఉష్ణాన్ని తగ్గిస్త

మంగళవారం, 13 మార్చి 2018 (15:37 IST)
వేసవిలో చర్మ సమస్యలను దూరం చేసుకోవాలంటే మినుములు, పెసలు, బియ్యాన్ని ఉపయోగించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మినుములు, పెసళ్లు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇంకా శరీర ఉష్ణాన్ని తగ్గిస్తాయి. పెసళ్లలో ఇనుము, ధాతువులు పుష్కలంగా వుంటాయి. అలాగే బియ్యం కూడా శరీర వేడిని తగ్గిస్తాయి. ఈ మూడింటిని సమపాళ్లు తీసుకుని పౌడర్‌లా తయారు చేసి.. ముఖానికి, చర్మానికి రోజు మార్చి రోజు ప్యాక్‌లా వేసుకుంటే చర్మంపై మొటిమలు మాయమవుతాయి. అలాగే చెమటకాయలు దూరమవుతాయి. 
 
అలాగే బియ్యంతో చేసిన జావ వేసవిలో శరీర వేడిని తగ్గిస్తుంది. బియ్యం ఒక కప్పు, బెల్లం అర కప్పు, పెసలు పావు కప్పు, ఏలకులు రెండు, పాలు గ్లాసుడు తీసుకుని జావగా ఎలా చేయాలో చూద్దాం. బియ్యాన్ని కడాయిలో వేయించుకుని.. రవ్వలా మిక్సీలో కొట్టి పక్కనబెట్టుకోవాలి. 
 
ఓ పాత్రలో బెల్లాన్ని తీసుకుని నీటిని చేర్చి కరిగించాలి. అందులో ఉడికించిన పెసలు పప్పు, రవ్వలా చేసుకున్న బియ్యం చేర్చాలి. యాలకులు కూడా చేర్చాలి. బియ్యం ఉడికేంత వరు వుంచి దించేయాలి. ఈ గంజిని వేసవిలో రోజూ తీసుకుంటే.. వేడి తగ్గిపోతుంది. పిల్లలు, పెద్దలకు ఈ గంజి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

ఆంధ్ర ప్రజలకు హెచ్చరిక, ఆ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు, జాగ్రత్త

Annamalai: బీజేపీకి బైబై చెప్పనున్న అన్నామలై

పవన్ కళ్యాణ్ జనసేన సమావేశానికి పోలీసుల అనుమతి నిరాకరణ

రాజ్యసభకు వైఎస్ షర్మిల నామినేషన్ ఖరారు

27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

అన్నీ చూడండి

Shalini: సింగ్ గీతం లో విలన్ క్యారెక్టర్ చేశాను. మాటే పాటగా మారే కథ ఇది : శాలిని కొండెపుడి

Sunitha: భానుచందర్, సునీత, సి కళ్యాణ్ ఆవిష్కరించిన కొత్త మలుపు ట్రైలర్

SV Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి మ్యూజిక్ కు వరల్డ్ రికార్డ్ గుర్తింపు దక్కింది

Janhvi Kapoor : సినిమా అనేది ప్రజలకు చేసే సేవ : జాన్వీ కపూర్

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ చిత్రం ఇరుముడి గ్లింప్స్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments