అతిగా కూర్చున్నారో అంతే సంగతులు.. ఐదు నిమిషాలైనా లేచి?

కార్యాలయాల్లో, ఇళ్ళల్లో ఎక్కువ గంటలు కూర్చునే వారి సంఖ్య పెరిగిపోతోంది. తద్వారా క్యాన్సర్ ముప్పు వుందని ఇప్పటికే అధ్యయనాలు తేల్చాయి. రెండు గంటలకంటే ఎక్కువ సమయం కూర్చొని ఉంటే 8 శాతం కోలోన్ క్యాన్సర్, 1

శనివారం, 7 అక్టోబరు 2017 (13:35 IST)
కార్యాలయాల్లో, ఇళ్ళల్లో ఎక్కువ గంటలు కూర్చునే వారి సంఖ్య పెరిగిపోతోంది. తద్వారా క్యాన్సర్ ముప్పు వుందని ఇప్పటికే అధ్యయనాలు తేల్చాయి. రెండు గంటలకంటే ఎక్కువ సమయం కూర్చొని ఉంటే 8 శాతం కోలోన్ క్యాన్సర్, 10 శాతం ఎండోమెట్రియల్ క్యాన్సర్, 6శాతం లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. గంటల సేపు కూర్చోవడం.. టీవీలు చూస్తూ జంక్‌ఫుడ్స్ లాగించేయడం ప్రమాదానికి దారితీస్తాయని వైద్యులు అంటున్నారు. 
 
అతిగా కూర్చోవడం అనారోగ్య సమస్యలను కొనితెచ్చి పెడుతుంది. అందుకే కనీసం గంటకోసారైనా ఐదు నిమిషాలపాటు లేచి కాస్త అటూఇటూ నడవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కనీసం పదినిమిషాలపాటు నడిచేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా ఫోను మాట్లాడేటప్పుడు నిల్చునో, నడుస్తూనో మాట్లాడండి. 
 
వీలైనంత వరకు నిల్చుని పనిచేసేందుకు అలవాటు పడండి. టీవీలో రెండున్నరగంటలసేపు సినిమా చూస్తుంటే కనీసం ఓ అర్ధగంటైనా నిల్చోవడానికి ప్రయత్నించండి. ఇవన్నీ చేస్తే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments