యాపిల్ - ఒప్పో ఫోన్లు వాడుతున్నారా? ప్రమాదమే... ఎలా?

భారత మొబైల్ మార్కెట్‌ను చైనా మొబైల్స్ ముంచెత్తుతున్నాయి. అతి తక్కువ ధరకు అత్యాధునిక ఫీచర్లు ఉండటంతో అనేక మంది వాటిపై మొగ్గుచూపుతున్నారు.

గురువారం, 17 ఆగస్టు 2017 (09:51 IST)
భారత మొబైల్ మార్కెట్‌ను చైనా మొబైల్స్ ముంచెత్తుతున్నాయి. అతి తక్కువ ధరకు అత్యాధునిక ఫీచర్లు ఉండటంతో అనేక మంది వాటిపై మొగ్గుచూపుతున్నారు. అయితే, ఈ ఫోన్ల వల్ల పెను ముప్పు ఉన్నట్టు కేంద్రం హెచ్చరించింది. 
 
చైనా మొబైల్ ఫోన్లు కలిగిన వినియోగదారుల పూర్తి సమాచారంతో పాటు ఫోన్‌లోని కాంటాక్ట్‌ లిస్ట్‌, మెసేజ్‌లను దొంగచాటుగా తీసేసుకోవచ్చని కేంద్రం చెపుతోంది. ఈ నేపథ్యంలోనే దిగ్గజ మొబైల్‌ సంస్థ యాపిల్ సహా షియోమీ, వివో, ఒప్పో, జియోనీ వంటి ఫోన్లకు బుధవారం ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది.
 
అంతేకాదు, ఈ వ్యవహారంలో శాంసంగ్‌, మైక్రోమాక్స్‌ వంటి మరో 21 కంపెనీలకూ నోటీసులిచ్చింది. ‘‘కంపెనీలకు 28 వరకు సమయమిస్తున్నాం. ఆలోగా వినియోగదారుల సమాచార భద్రతకు సంస్థలు తీసుకుంటున్న చర్యలను వెల్లడించాలి’’ అని ఆ శాఖ అధికార వర్గాలు ప్రకటించాయి. కంపెనీలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని తేలితే భారీ జరిమానా విధిస్తామని ఓ అధికారి హెచ్చరించారు.

అన్నీ చూడండి

క్రికెటర్ తిలక్ వర్మతో శ్రీలీల రిలేషన్... సోషల్ మీడియాలో పుకార్లు

Shraddha Das: మైథలాజికల్ థ్రిల్లర్‌గా శ్రద్ధాదాస్‘త్రికాల సిద్దమైంది

కోలీవుడ్‌లో విషాదం.. నదిలో దూకి నిర్మాత ఆత్మహత్య... ఎఁదుకో తెలుసా?

Chiru158: తన 158వ సినిమా బాబీ కొల్లి కాంబినేషన్ లో ప్రారంభిస్తున్నానని ప్రకటించిన చిరంజీవి

సినిమాపై అవగాహన లేని వ్యక్తికి సినిమాటోగ్రఫీ శాఖనా? సీఎం విజయ్‌పై విశాల్ ఫైర్

తర్వాతి కథనం
Show comments