ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్లో స్నాప్ డీల్ ఉద్యోగి దీప్తి సర్నా బుధవారం నాడు అదృశ్యమైంది. ఆ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆటోలో వెళుతూ తన స్నేహితురాలితో మాట్లాడుతూ ఉంది. ఐతే అకస్మాత్తుగా ఆమె పెద్దగా కేకలు వేసింది. ఆమె అలా అరుస్తున్నప్పుడు కొందరు చూశారు కూడా. ఐతే ఆ ఆటో ఆ తర్వాత కనిపించకుండా పోయింది.