గుజరాత్లో చెలరేగిన కుల చిచ్చు తీవ్ర రూపందాల్చింది. పటేల్ కులస్థులను ఓబీసీ జాబితాలో చేర్చడంతో పాటు రిజర్వేషన్లు కల్పించాలంటూ రెండు రోజులుగా గుజరాత్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. పటేళ్ళ ఆందోళనల కారణంగా ఇప్పటికి ఎనిమిది మంద్రి ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకారులు గురువారం ఆ రాష్ట్ర హోంమంత్రి రజని పటేల్ ఇంటికి నిప్పుపెట్టారు.