ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 అక్టోబరు 2024 (15:46 IST)

మాజీ ప్రియుడిపై యాసిడ్ పోసిన యువతి.. ఎందుకో తెలుసా?

తన మాజీ ప్రియుడుపై ఓ యువతి యాసిడ్ పోసింది. బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులకు పాల్పడుతుండటంతో ఈ ఘాతునికి పాల్పడింది. దీంతో మాజీ ప్రియుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆలీగఢ్‌ ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అలీగఢ్‌లోని ఓ రెస్టారెంట్‌కు శనివారం ఉదయే ఓ యువతి వచ్చింది. ఆ తర్వాత కాసేపటికి యువకుడు వచ్చాడు. ఇద్దరూ ఓ టేబుల్ వద్ద కూర్చొని టిఫిన్‌కు ఆర్డర్ చేసి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో యువతి తన హ్యాండ్ బ్యాగులో నుంచి యాసిడ్ బాటిల్ తీసి యువకుడి ముఖంపై చల్లింది. దీంతో తీవ్రగాయాలపాలైన యువకుడు అక్కడ నుంచి పారిపోయాడు. ఆ యువకుడు తన మాజీ ప్రియుడని, తనను బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుండటంతో తట్టుకోలేకే ఇలా చేశానని యువతి చెప్పింది. 
 
తనకు ఇదివరకే వివాహం జరిగిందని, విడాకులు తీసుకున్నానని పోలీసులకు వెవిరించింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతడికి దగ్గరయ్యానని, అతడి తీరు నచ్చక దూరంగా ఉంటున్నట్టు వెల్లడించింది. అయితే, తాము విడిపోయినా తనను వేధిస్తుండటంతో తట్టుకోలేక ఈ పనికి పాల్పడినట్టు తెలిపింది. కాగా, ఈ దాడిలో యువతికి కూడా యాసిడ్ గాయాలయ్యాయని, పోలీసులు చెప్పారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స చేయించాక అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు.