గోవాలో దారుణం.. నగ్నంగా రక్తపు మడుగులో విదేశీ యువతి.. ఏం జరిగింది?
గోవాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పర్యాటక రాష్ట్రంగా పేరొందిన గోవాకు విదేశీయుల రాక ఎక్కువే. అలా గోవాను సందర్శంచేందుకు వచ్చిన విదేశీ యువతిపై దారుణం జరిగింది. గోవాలో ఓ విదేశీ యువతి రక్తపు మడుగులో నగ్నం
గోవాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పర్యాటక రాష్ట్రంగా పేరొందిన గోవాకు విదేశీయుల రాక ఎక్కువే. అలా గోవాను సందర్శంచేందుకు వచ్చిన విదేశీ యువతిపై దారుణం జరిగింది. గోవాలో ఓ విదేశీ యువతి రక్తపు మడుగులో నగ్నంగా పడివుండటం కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. ఐర్లాండ్కు చెందిన ఓ మహిళ తన బాయ్ఫ్రెండ్తో కలిసి ఇటీవల గోవాకు వచ్చింది. వీరిద్దరూ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఆపై విదేశీ యువతి కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆమె మృతదేహం నగ్నంగా బీచ్లోని నిర్మానుష్య ప్రాంతంలో రక్తపు మడుగులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దృశ్యం స్థానికులను భయభ్రాంతులను చేసింది.
పోలీసులు విదేశీ యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. హత్యకు ముందు అత్యాచారం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మృతురాలి బాయ్ఫ్రెండ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.