గురువారం, 24 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 23 అక్టోబరు 2024 (19:15 IST)

జాతీయ జల అవార్డులలో అపూర్వ విజయం సాధించిన కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ

image
ఐదవ జాతీయ జల అవార్డులు 2023లో ఉత్తమ సంస్థ (పాఠశాల/కళాశాల కాకుండా) కేటగిరీలో కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ సగర్వంగా అఖిల భారత స్థాయిలో ద్వితీయ బహుమతిని పొందింది. ఈ అవార్డు ప్రదానోత్సవం అక్టోబర్ 22, 2024న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగింది. గౌరవనీయులైన భారత రాష్ట్రపతి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, ఈ కార్యక్రమానికి వైభవాన్ని జోడించారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ ప్రకటించిన ఈ ప్రతిష్టాత్మక పురస్కారం, వివిధ విభాగాలలో జల వనరుల నిర్వహణ మరియు పరిరక్షణలో అత్యుత్తమ విజయాలను గుర్తిస్తుంది. నీటి పొదుపు నిర్వహణలో ప్రశంసనీయమైన కృషికి విశ్వవిద్యాలయం గుర్తింపు పొందింది, గణనీయమైన రీతిలో జాతీయ గుర్తింపునూ సంపాదించింది.
 
నీటి సంరక్షణ పద్ధతులు, పర్యావరణ అనుకూల జల వనరుల నిర్వహణ పద్ధతులలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించే సంస్థలకు జాతీయ జల అవార్డులు (నేషనల్ వాటర్ అవార్డులు) అందజేయబడతాయి. ఈ ప్రయత్నాలకు ప్రశంసా పూర్వకంగా ట్రోఫీ, ప్రశంసాపత్రం, నగదు రివార్డులను మంత్రిత్వ శాఖ అందజేసింది.
 
కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డా. జి. పార్ధసారధి వర్మ ఈ విజయం యొక్క ప్రాముఖ్యతను వెల్లడిస్తూ "జాతీయ జల అవార్డులలో భారతదేశ వ్యాప్తంగా రెండవ ర్యాంక్ సాధించడం ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నాము. పర్యావరణ సారథ్యం పరంగా ఇది మా నిరంతర నిబద్ధతను సూచిస్తుంది. భవిష్యత్ కార్యక్రమాలకు బెంచ్‌మార్క్‌ను నిర్దేశిస్తుంది" అని అన్నారు. 
 
ఈ ప్రశంసలను అందుకోవడం పట్ల ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ డీన్ డాక్టర్ వుల్లంకి రాజేష్ మాట్లాడుతూ, "ఈ అవార్డు మా మొత్తం బృందం యొక్క అవిశ్రాంత కృషి మరియు నిబద్ధతకు నిదర్శనం. ఇది మేము ఇప్పటికే సాధించిన విజయాలను వేడుక జరుపుకుంటుంది, నీటి సంరక్షణ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి మమ్మల్ని ప్రేరేపిస్తుంది.." అని అన్నారు. 
 
నీటి వినియోగాన్ని మెరుగుపరచటానికి, పర్యావరణ నిర్వహణను మెరుగుపరచడానికి అనేక పర్యావరణ అనుకూల పద్ధతులను విశ్వవిద్యాలయం అమలు చేస్తుంది. విశ్వవిద్యాలయ హాస్టళ్లలో డ్యూయల్ ప్లంబింగ్ సిస్టమ్స్, 28 రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, రెండు ఓపెన్ వెల్స్, ఐదు బోర్‌వెల్ ఇన్‌ఫిల్ట్రేషన్ సదుపాయాలు భూగర్భజల స్థాయిలను మెరుగుపరిచేందుకు ఉన్నాయి. అదనంగా, మేము గంటకు 24,750 లీటర్ల మిశ్రమ వడపోత సామర్థ్యంతో 21 రివర్స్ ఆస్మాసిస్ ప్లాంట్‌లను ఏర్పాటు చేసాము. క్యాంపస్‌లోని మురుగునీటి శుద్ధి కర్మాగారం నుండి రీసైకిల్ చేయబడిన నీటిని స్ప్రింక్లింగ్ సిస్టమ్ ద్వారా గార్డెనింగ్ కోసం సమర్ధవంతంగా వినియోగిస్తున్నారు. నీటి పరిరక్షణ పట్ల మా నిబద్ధత 550 సెన్సార్-ఆధారిత యూరినల్స్ మరియు సమర్థవంతమైన నీటి నిర్వహణను ప్రోత్సహించే 662 కంటే ఎక్కువ నీటి మీటర్ల ద్వారా మరింత రుజువు చేయబడింది. వ్యర్థ పదార్థాల నిర్వహణలో, మేము అన్ని వ్యర్థ వర్గాలలో 100% రీసైక్లబిలిటీని సాధించాము, క్యాంపస్‌లో సమగ్రమైన పర్యావరణ అనుకూల ప్రయత్నాలను నిర్ధారిస్తున్నాము. 
 
వనరులను సంరక్షించడానికి అవసరమైన ప్రమాణాలను నిరంతరం విశ్వవిద్యాలయం అనుసరించేలా మేనేజ్‌మెంట్, సీనియర్‌ల మార్గదర్శకత్వంలో, ఈ వినూత్న కార్యక్రమాలను అధ్యాపకులు మరియు సిబ్బందితో పాటు కన్నెగంటి జ్యోతిష్య బ్రహ్మాచారి, అసోసియేట్ డీన్, ప్లానింగ్ మరియు డెవలప్‌మెంట్  పర్యవేక్షిస్తున్నారు.