Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కరోనా పరీక్షలు.. ఫలితం నెగటివ్

Written By సెల్వి
Updated: మంగళవారం, 12 మే 2020 (09:15 IST)
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అనారోగ్యం కారణంగా ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. కొన్ని కొత్త ఔషధాల వాడకంతో రియాక్షన్‌ వచ్చి జ్వరం రావడంతో ఆదివారం రాత్రి మన్మోహన్‌ను ఎయిమ్స్‌లో చేర్పించిన సంగతి విదితమే. 
 
సోమవారం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగైందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. అయితే ముందస్తు జాగ్రత్తగా మన్మోహన్ సింగ్‌కు కరోనా నిర్ధారణ పరీక్ష కూడా నిర్వహించామని, ఫలితం నెగెటివ్‌ అని వచ్చిందని పేర్కొన్నాయి.
 
నిజానికి.. ఆయనకు కరోనా పరీక్షలు చేస్తున్నప్పుడు అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ పరీక్షల్లో ఏం తేలుతుందోనని అందరూ ఆసక్తిగా చూశారు. కానీ.. ఆయనకు నెగెటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడడంతో ఆయనను ఆస్పత్రి నుంచి మంగళవారం డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

అన్నీ చూడండి

Dhanush: ఇరుముడి నటి నక్షత్రను వీడియో కాల్‌లో ధనుష్ ప్రశంస, రష్మిక కితాబు

Kiku chiranjeevi: మా ఫ్లెక్సీలను తీసేసి డబ్బింగ్ సినిమా ఫ్లెక్సీలు పెడుతున్నారు : కికు యనమల

Thammareddy Bharadwaja :పెళ్లి చేసి చూడు అంటారు. అలా కొత్త సినిమా మేకింగ్ లో ఇబ్బందులు దాటాం

మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్ తో జగమే సంగీతం' ట్రైలర్‌

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ సినిమా హైవాన్ ట్రైలర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments