శనివారం, 21 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 ఆగస్టు 2022 (11:24 IST)

దలాల్ స్ట్రీట్ బిగ్ బుల్ రాకేశ్ ఝున్ ఝుల్ వాలా ఇకలేరు

rakesh
దలాల్ స్ట్రీట్ బిగ్ బుల్‌గా గుర్తింపు పొందిన రాకేశ్ ఝున్ ఝున్ వాలా ఇకలేరు. గత రెండు వారాలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈయన ఇటీవలే ఆకాశ్ ఎయిర్ అనే విమానాయాన సంస్థతో విమానయాన రంగంలోకి అడుగుపెట్టారు. 
 
62 యేళ్ళ ఝున్ ఝున్ వాలా దేశంలోని ప్రముఖ బిలియనీర్‌ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. స్టాక్ ట్రేడర్, ఇన్వెస్టర్‌గా ఉన్న ఈయన హఠాన్మరణం పట్ల ప్రధాని మోడీ సైతం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం ఉదయం 6.45 గంటల సమయంలో రాకేశ్‌ను ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రికి తరలించారు. 
 
అయితే, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. రెండుమూడు వారాల క్రితమే ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అంతలోనే ఆయన మరణవార్త పారిశ్రామికవేత్తలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
 
రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా ‘ఆకాశ ఎయిర్’తో ఇటీవలే విమానయాన రంగంలో అడుగుపెట్టారు. తొలి విమానం ఈ నెల 7న సేవలు ప్రారంభించింది. ఇన్వెస్టర్‌గానే కాకుండా యాప్‌టెక్ లిమిటెడ్, హంగామా డిజిటల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్‌గానూ ఝున్‌ఝున్‌వాలా అందరికీ సుపరిచితం. 
 
అంతేకాదు, పలు సంస్థలకు డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ టు యునైట్ నేషన్స్‌కు భారత సలహాదారుగానూ ఉన్నారు. రాకేశ్‌కు దాతృత్వం కూడా ఎక్కువే. తన సంపాదనలో 25 శాతాన్ని విరాళంగా ఇస్తున్నారు. హెల్త్‌కేర్, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్ వంటి వాటికి విరాళాలు అందిస్తున్నారు.