పెళ్లికి అంగీకరించలేదని ఓ టీచర్‌ని తరగతి గదిలోనే..

శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (17:53 IST)
పెళ్లికి ఒప్పుకోలేదని తరగతి గదిలోనే ఓ టీచరమ్మను హత్య చేసిన ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది. గాయత్రి మెట్రిక్యులేషన్ పాఠశాలలో గణితం భోధించేందుకు వచ్చిన ఎస్ రమ్య అనే 23 ఏళ్ల యువతిపై రాజశేఖర్ అనే వ్యక్తి దాడి చేసాడు. బాధితురాలి ఇల్లు విద్యాసంస్థకు సమీపంలోనే ఉండటంతో ఆమె త్వరగానే పాఠశాలకు చేరుకుంది. 
 
ఇదే అదునుగా చూసిన నిందితుడు ఆమెను అతి కిరాతకంగా హత్య చేసాడని అధికారులు తెలిపారు. పెళ్లి ప్రస్తావనను తిరస్కరించినందుకే ఆమెపై దాడికి తెగబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
కాలేజీలో చదువుకునే సమయంలోనే నిందితుడికి ఆమె తెలుసని, ఆరు నెలల క్రితం బాధితురాలి తల్లిదండ్రుల వద్దకు రాజశేఖర్ వివాహ ప్రస్తావనను తీసుకురావడంతో వారు అందుకు సమ్మతించలేదు. పెళ్లికి నిరాకరించారనే కోపంతోనే నిందితుడు దాడికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

అన్నీ చూడండి

Rukmini Vasanth: రుక్మిణి వసంత క్యాజువల్ ప్యాకింగ్ క్లిప్ అభిమానుల ప్రశంసలు

Virat Karna: నాగబంధం పోస్ట్-ప్రొడక్షన్ - విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీ

Vadde Naveen: వడ్డే నవీన్ నటిస్తూ నిర్మించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

Chiru 158: రెగ్యులర్ షూటింగ్ లో చిరంజీవి 158వ చిత్రం

తర్వాతి కథనం
Show comments