1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 11 మార్చి 2017 (16:56 IST)

ఉత్తరాఖండ్ : ప్రధాని మోడీపై ఉన్న అభిమానం ఓట్ల సునామీగా మారింది

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఉన్న అభిమానం ఓట్ల సునామీగా మారి భారతీయ జనతా పార్టీని విజయతీరాలకు చేర్చింది. పర్వతాలు, గంగా, యమునా నదుల మధ్య కొలువుదీరి ఉన్న దేవ భూమిగా పరిగణించే ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఉన్న అభిమానం ఓట్ల సునామీగా మారి భారతీయ జనతా పార్టీని విజయతీరాలకు చేర్చింది. పర్వతాలు, గంగా, యమునా నదుల మధ్య కొలువుదీరి ఉన్న దేవ భూమిగా పరిగణించే ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన హరీశ్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బీజేపీకి బాగా కలిసివచ్చింది.
 
దీనికి తోడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విస్తృత స్థాయి ప్రచారం కాషాయ జెండా రెపరెపలకు కారణమైంది. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు, ఆ పార్టీ నుంచి మాజీ సీఎం విజయ్ బహుగుణ సారథ్యంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం హస్తవాసి క్షీణించిపోవడానికి మరో కారణంగా కనిపిస్తున్నది.
 
మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు సాధారణ మెజార్టీ 36 సీట్లు. కానీ, ఈ ఎన్నికల్లో బీజేపీ ఆ మ్యాజిక్ సంఖ్యను దాటిపోయింది. బీజేపీకి 56 సీట్లు, కాంగ్రెస్‌కు 11, ఇతరులకు 2 సీట్లు చొప్పున రాగా, ఒక స్థానం ఫలితం రావాల్సి ఉంది. దీంతో ఈ రాష్ట్రంలో బీజేపీ సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.