గురుగ్రహ అనుగ్రహం కోసం ఏం చేయాలి?
విద్యను నమ్ముకున్నవాళ్లు బాగుపడటమే తప్ప, బాధపడటం ఎప్పటికీ జరగదు. విద్య అనేది తేజస్సును ... ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రత్యేకమైన స్థానాన్ని ప్రసాదిస్తూ కీర్తి ప్రతిష్ఠలను అందిస్తుంది. విద్య పట్ల ఆసక్తిని కలిగించి దాని ద్వారా ఉన్నతమైన స్థానానికి మానవుడు చేరుకోవడానికి కారణం గురు భగవానుడే(గురు గ్రహమే) కారణమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
జాతకంలో గురుగ్రహ దోషం కారణంగా ఆయన ప్రతికూలంగా ఉన్నప్పుడు, నేర్చిన విద్య రాణించకపోవడం జరుగుతూ ఉంటుంది. నేర్చిన విద్య ఏదైనా అది రాణించకపోతే జీవితం అగమ్యగోచరంగా మారిపోతుంది. ఫలితంగా అనేక ఇబ్బందులను, అవమానాలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే, గురు భగవానుడి అనుగ్రహాన్ని సంపాదించుకోవాలి.
గురువు ప్రీతి చెందాలంటే పసుపురంగు వస్త్రాలు, శనగలు, బెల్లం, ఆవునెయ్యి దానంగా ఇవ్వాలి. ఈ విధంగా చేయడం వలన గురువు సంతృప్తి చెందుతాడనీ, ఫలితంగా దోష ప్రభావం తగ్గుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.