గురువారం, 5 జూన్ 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 అక్టోబరు 2015 (14:35 IST)

1000 కాళ్ల మండప పునర్నిర్మాణానికి తితిదే శ్రీకారం!

తిరుమల గిరులపై ఎంతో ప్రాశస్త్యమున్న 1000 కాళ్ల మండపాన్ని పునర్నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి శ్రీకారం చుట్టింది. 1472లో సాలవ నరసింహరాయులు ప్రధాన ఆలయం ఎదురుగా నిర్మించిన వెయ్యి కాళ్ల మండపం క్రమంగా మాయమైపోయింది. అప్పట్లో ఆలయ భద్రతతో పాటు వైకుంఠ క్యాలైన్లు, మాడ వీధులు, వాహన రాకపోకల కోసం వెయ్యి కాళ్ల మండపాన్ని తొలగించేశారు. 
 
అప్పట్లో ఈ మండపాన్ని తొలగించడంతో తితిదేపై విమర్శలు వెల్లువెత్తాయి. మహారాజులు శుభకార్యాల తలపెట్టాలంటే.. ఇక్కడికొచ్చి స్వామివారిని దర్శించుకుంటారని అలాంటి ప్రాశస్త్యమున్న మండపాన్ని తొలగించడంపై పండితులు, భక్తులు, పీఠాధిపతులు మండిపడ్డారు. అయితే ఆ వెయ్యి కాళ్ల మండపాన్ని ప్రస్తుతు పునర్నిర్మించడానికి తితిదేనే శ్రీకారం చుట్టడంపై పండితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇందుకోసం సోమవారం జరిగిన పాలకమండలి సమావేశంలో సభ్యులు స్తపతి సంస్థ ముందుంచిన నమూనాలను పరిశీలించారు. ఇంకా మరికొన్ని నమూనాలను కూడా పరిశీలించనున్నట్లు పాలకమండలి సభ్యులు అంటున్నారు. ఆగమ పండితులు, స్తపతుల వద్ద చర్చించి ఈ వెయ్యి కాళ్ల మహా నిర్మాణాన్ని చేపడతామని తితిదే అధికారులు చెప్తున్నారు. నారాయణ ఉద్యానవనంలో ఈ మండపాన్ని ఏర్పాటు చేసేందుకు తితిదే చర్యలు తీసుకుంటుంది.