భారత హాకీ మహిళా జట్టు జోరు.. మలేసియాపై రెండో విజయం!
మలేసియాతో జరుగుతున్న ఆరు టెస్టుల హాకీ సిరీస్లో భారత మహిళా జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. కామన్వెల్త్ గేమ్స్కు సన్నాహకంగా మలేషియాతో జరుగుతున్న ఈ టెస్టు సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన రెండో మ్యాచ్లో భారత్ 2-0 తేడాతో మలేషియాపై విజయం సాధించింది. దీంతో ఆరు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ తొలి అర్ధభాగంలో అనురాధ దేవి(10నిమిషంలో)చేసిన ఫీల్డ్గోల్తో భారత జట్టు ఖాతా తెరవగా, పూనమ్రాణి(28ని) చేసిన గోల్తో 2-0తో ముందంజ వేసింది.