19న హైదరాబాద్‌ లో కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం

గురువారం, 17 సెప్టెంబరు 2020 (06:25 IST)
హైదరాబాద్‌ దుర్గంచెరువులో నిర్మితమైన కేబుల్‌ బ్రిడ్జి అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ నెల 19న దాని ప్రారంభోత్సవం జరుగనుంది. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ కేబుల్‌ బ్రిడ్జిని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఇప్పటికే దుర్గంచెరువుపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. ఈ బ్రిడ్జి రాత్రి సమయంలో జిగేల్‌మంటూ ఆకర్షించే రీతిలో విద్యుత్‌ కాంతులు అందరినీ కట్టి పడేస్తున్నాయి. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 45 నుంచి ఐటి కారిడార్‌ను కేబుల్‌ బ్రిడ్జి ద్వారా అనుసంధానం చేస్తూ రూ.184 కోట్ల వ్యయంతో నిర్మించారు.

233 మీటర్ల పొడవు, ఆరు లేన్ల వెడల్పు ఉంటుంది. పాదచారులు, సైకిలిస్ట్‌ల కోసం ప్రత్యేక ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. బ్రిడ్జిపై ప్రత్యేకంగా లైటింగ్‌ ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో వివిధ రంగుల్లో జిగేల్‌మంటోంది. కేబుల్‌ బ్రిడ్జికి రెండువైపుల వాటర్‌ ఫౌంటేన్‌లు ఏర్పాటు చేయనున్నారు.

అన్నీ చూడండి

Raka Fans Title: అల్లు అర్జున్ .. రాకా చిత్ర యానిమేటెడ్ టైటిల్ కు స్పందన

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ .. పంజ 4Kలో థియేటర్లలోకి తిరిగి వస్తోంది

Peddi: రామ్ చరణ్ తో ఐటెంసాంగ్ లో అలరించిన శృతి హాసన్, జాన్వీ కపూర్

హాలీవుడ్ క‌ల‌ర్స్‌ రియలిస్టిక్‌, ఇండియ‌న్ క‌ల‌ర్‌ ఎమోష‌న‌ల్‌, క‌ల్చ‌ర‌ల్లీ రిచ్‌ : కిషోర్ బోయిడాపు

Sri Satya: బిగ్ బాస్'ఫేమ్ శ్రీ సత్య ఆవిష్కరించిన విహారి OTT గ్లోబల్ విజన్

తర్వాతి కథనం
Show comments