కరీంనగర్‌లో కారు బీభత్సం... నిద్రిస్తున్న నలుగురు మృతి

ఆదివారం, 30 జనవరి 2022 (09:08 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున దారుణం జరిగింది. స్థానిక కమాన్ చౌరస్తాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ గుడిసెపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఓ గుడిసెలో నిద్రస్తున్న వారే కావడం గమనార్హం. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
 
ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను ఫరియాద్, సునీ, లలిత, జ్యోతిలుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments