కరీంనగర్‌లో కారు బీభత్సం... నిద్రిస్తున్న నలుగురు మృతి

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 30 జనవరి 2022 (09:10 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున దారుణం జరిగింది. స్థానిక కమాన్ చౌరస్తాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ గుడిసెపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఓ గుడిసెలో నిద్రస్తున్న వారే కావడం గమనార్హం. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
 
ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను ఫరియాద్, సునీ, లలిత, జ్యోతిలుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 

అన్నీ చూడండి

బోరున విలపించిన కోలీవుడ్ నటి : ఎందుకో తెలుసా?

Manchu Lakshmi: సంప్రదాయ బోధనే చిన్నారుల ఎదుగులకు పునాది :మంచు లక్ష్మి

అందుకే బెనాక గోల్డ్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వున్నా : నాగబాబు

పెయిడ్ ప్రీమియర్స్ తో 3.13 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన చెన్నై లవ్ స్టోరీ

వంద దేవుళ్ళు మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించిన జీతెలుగు

తర్వాతి కథనం
Show comments