ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 డిశెంబరు 2021 (12:46 IST)

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పెరిగిన ధరలు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరిగే పూజల ఛార్జీలు పెరిగాయి. ఈ పెరిగిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి. 
 
స్వామి వారికి జరిపే నిత్య కైంకర్యములు, శాశ్వత పూజలు, భోగములు, స్వామివారి ప్రసాదముల రేట్లను పెంచారు ఆలయ అధికారులు. 
 
చాలా కాలంగా యాద్రాద్రిలో పూజలకు సంబంధించిన రేట్లను పెంచలేదని... అందుకే ప్రస్తుతం స్వామివారికి వివిధ రకాల సేవలకు సంబంధించి రేట్లను పెంచుతున్నట్లు ఆలయ కమిటీ ఓ ప్రకటనలో తెలియజేసింది.