1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Junior Artist Jyothi Reddy died while getting running train in shadnagar

ప్రాణం తీసిన పొరపాటు... రన్నింగ్ ట్రైన్ ఎక్కే ప్రయత్నంలో జూ.ఆర్టిస్ట్ మృతి

Junior Artist Jyothi Reddy
ఓ చిన్నపొరపాటు ప్రాణం తీసింది. రన్నింగ్ ట్రైన్ ఎక్కే ప్రయత్నం చేసిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన షాద్ నగర్ రైల్వే స్టేషనులో జరిగింది. సంక్రాంతి పండగకి సొంతూరుకు వెళ్లి తిరిగి హైదరాబాద్ నగరానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కడపకు చెందిన జ్యోతిరెడ్డి (28) అనే యువతి హైదరాబాద్ నగరంలో హెచ్‌డీఎఎఫ్‌సి బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే జూనియర్ ఆర్టిస్టుగా పని చేస్తుంది. సంక్రాంతి పండుగ కోసం సొంతూరు వెళ్లిన జ్యోతి సోమవారం రాత్రి తిరిగి హైదరాబాద్ నగరానికి పయనమైంది. 
 
ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున రైలు షాద్ నగరులో రైల్వే స్టేషన్‌లో ఆగింది. రైలు ఆగడంతో కాచిగూడ వచ్చేశామని భావించిన జ్యోతి రైలు దిగేసింది. అయితే, ఆ తర్వాత అది షాద్‌నగర్‌ అని తెలుసుకుని కంగారుపడింది. అప్పటికే రైలు కదలదడంతో రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించి అదుపుతప్పి కిందపడిపోయింది. తీవ్రంగా గాయపడిన జ్యోతిరెడ్డిని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ విషయం తెలిసిన జూనియర్ ఆర్టిస్టులు జ్యోతి మృతికి రైల్వే నిర్లక్ష్యమే కారణంగా ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
భారతదేశంలో OnePlus నుంచి OnePlus 9RT విడుదల