1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : ఆదివారం, 25 జనవరి 2015 (16:01 IST)

తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు... కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం!

తెలంగాణ మంత్రివర్గంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మార్పులు చేశారు. ఉపముఖ్యమంత్రి రాజయ్యను తొలగించిన కేసీఆర్, ఆయన స్థానంలో కడియం శ్రీహరిని నియమించారు. ఈ మేరకు ఆయన హైదరాబాదులోని రాజ్ భవన్‌లో గవర్నర్ నరసింహన్ సమక్షంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ మంత్రివర్గం హాజరైంది.
 
ప్రస్తుతం కడియం శ్రీహరి వరంగల్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈయనకు ఉపముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు అప్పగించారు. కాగా, కడియం రాకతో మంత్రివర్గంలో మార్పులు చోటుచేసుకున్నాయి. కడియంకు విద్యాశాఖను కేటాయించగా, జగదీశ్వర్ రెడ్డికి విద్యుత్ శాఖను అప్పగించి, లక్ష్మా రెడ్డికి వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు.