Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాదాద్రి నిర్మాణ పనులపై కేసీఆర్ అసంతృప్తి

Written By ఎం
Updated: శనివారం, 17 ఆగస్టు 2019 (19:48 IST)
యాదాద్రి పనులు నత్తనడకన సాగుతుండడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు పూర్తి చేయడానికి మరో ఐదేళ్లు తీసుకొంటారా అని ఆయన ప్రశ్నించారు.
 
 శనివారం నాడు యాదాద్రి క్షేత్రంలో పనుల పురోగతిని సీఎం కేసీఆర్ పరిశీలించారు. అనంతరం స్థానిక హరిత హోటల్ లో అధికారులతో యాదాద్రి పనుల పై సీఎం కేసీఆర్ సమీక్షించారు. 
 
ఏప్పటిలోపుగా పనులు పూర్తి చేస్తారని సీఎం అధికారులను ప్రశ్నించారు. మరో ఐదేళ్లు సమయం కావాలా అని ఆయన ప్రశ్నించారు. ఆలయ అభివృద్దికి సంబంధించి రూ. 473 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్టుగా అధికారులు గుర్తు చేశారు. 

ఆర్ధిక శాఖ కార్యదర్శితో మాట్లాడి వెంటనే నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతామన్నారు.ఆలయ నిర్మాణ పనులకు సంబంధించి తక్షణమే రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు. 
 
యాడాకు మరో ఉన్నతాధికారిని కూడ నియమించనున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు.  ఆర్ అండ్ బీ పనులను పర్యవేక్షించేందుకు  సీఈ స్థాయి అధికారిని నియమిస్తామన్నారు. 

అన్నీ చూడండి

Rakul Preet Singh: అందం, అహంకారం ఉన్న స్త్రీగా నటించడం గర్వంగా వుంది

Allari Naresh: రంభ ఊర్వశి మేనక స్టెప్ లేస్తే తెల్లారి వేడుక... సాంగ్ రిలీజ్

Nani: ఫోక్ మాస్ ఆంథమ్‌గా ది ప్యారడైజ్ సెకండ్ సింగిల్ డల్లాస్‌లో లాంచ్

Vishwak Sen : పొలిటికల్ యాక్షన్ డ్రామాగా విశ్వక్ సేన్ LEGACY రాబోతోంది

స్కూల్ కు వెళ్లేప్పుడు చేసే సందడంతా సమ్మర్ హాలిడేస్ పాట

తర్వాతి కథనం
Show comments