కృత్రిమ అడవిని చూసి మురిసిన కెసిఆర్

గురువారం, 22 ఆగస్టు 2019 (08:23 IST)
తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్ధిపేటలోని కోమటిబండలో పర్యటించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్లతో కలిసి ఆయన కోమటిబండలోని అటవీ ప్రాంతాన్ని సందర్శించారు.

కోటికిపైగా మొక్కలను నాటి అక్కడ కృత్రిమ అడవిని ప్రభుత్వం సృష్టించింది. ఇప్పుడు ఆ అడవి అందరిని ఆకట్టుకుంటోంది. ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నది.

సిద్ధిపేట తరహాలోనే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా అలానే కృత్రిమ అడవులను సృష్టించేందుకు, తద్వారా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు తీసుకోవలసిన చర్యల గురించి.. మార్గదర్శకాల గురించి కోమటిబండలో కలెక్టర్ల సమావేశంలో కెసిఆర్ చర్చించబోతున్నారు. ఈ సమావేశానికి మంత్రులు కూడా హాజరయ్యారు.

అన్నీ చూడండి

Kiran Abbavaram,: యు/ఎ సర్టిఫికేషన్ పొందిన కిరణ్ అబ్బవరం... చెన్నై లవ్ స్టోరీ

Ravi Teja : ఇరుముడి' డబ్బింగ్ ప్రారంభించిన రవితేజ- త్వరలోనే సెకండ్ సింగిల్

శాన్‌ఫ్రాన్సిస్కోలో M4M 2 మూవీ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు

Sitara: ఎప్పటికీ చిన్నారి తార.. సితార అంటూ మహేష్ బాబు ఆప్యాయంగా ముద్దుపెట్టారు.

Vijay Deverakonda: రౌడీ జనార్థన మూవీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments