అన్నా రైలొస్తోంది.. ఇటు చూడన్నా... రైలు వచ్చేసింది.. దగ్గరకు వచ్చేసింది.. చూడన్నా.. అని బస్సులోని విద్యార్థులంతా కేకలు వేస్తూ బిగ్గరగా అరుస్తున్నా ఆ బస్సు డ్రైవర్ మాత్రం ఏమాత్రం చెవికెక్కించుకోలేదు. తాను 38 మంది చిన్నారులు ఉన్న బస్సును నడుపుతున్నాననే విషయాన్ని పూర్తిగా మరచిపోయి.. మొబైల్ ఫోన్లో అవతి వ్యక్తితో నవ్వుతూ.. నింపాదిగా మాట్లాడుతూ.. బస్సును నడుపుతూ వచ్చాడు. మాసాయిపేట - శ్రీనివాస్నగర్ రైల్వే క్రాసింగ్ వద్దకు వచ్చినప్పటికీ.. తన దృష్టిని డ్రైవింగ్పై మరల్చకుండా ఫోన్లో మాట్లాడటంపైనే దృష్టి కేంద్రీకరించాడు. ఫలితంగా 16 మంది చిన్నారులు తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. అనేకమంది గాయాలబారిన పడ్డారు. నాలుగు గ్రామాల ప్రజలకు తీరని కడపు శోకాన్ని మిగిల్చి, తాను కూడా మృత్యువడిలోకి జారుకున్నాడు కాకతీయ విద్యామందిర్ బస్సు డ్రైవర్.